లారీ ఢీ: సహోద్యోగి పెళ్లికి వెళ్తున్న ఇద్దరు టెక్కీలు మృతి
కడప:నగర శివారులో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయాలపాలయ్యారు.
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. మహారాష్ట్రకు చెందిన ప్రతీక్, హైదరాబాద్కు చెందిన అమృతరావు, రాజమహేంద్రవరానికి చెందిన సత్యనాగమణి, తిరుపతికి చెందిన సంతోష్కుమార్లు బెంగళూరులోని ఓ సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు.

కాగా, వీరి స్నేహితుడైన విద్యాసాగర్ వివాహానికి హాజరయ్యేందుకు కడపకు వస్తున్నారు. మరో 10 నిమిషాల్లో పెళ్లి మండపానికి చేరుకుంటారనగా.. వీరు ప్రయాణిస్తున్న కారును వేగంగా వచ్చిన ఓ లారీ ఢీకొంది. దీంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది.
ఈ ప్రమాదంలో ప్రతీక్ అక్కడికక్కడే మృతిచెందగా.. అమృతరావు రిమ్స్లో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలాడు. సత్యనాగమణి, సంతోష్కుమార్ తీవ్రంగా గాయపడటంతో వారిని ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications