వారు తెలుగు తల్లిని చంపారు: రోజా, జగన్ ఒక్కరే
చిత్తూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రోజా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆమె శనివారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనకు సహకరించిన కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడులు తెలుగుతల్లిని హత్య చేశారని ధ్వజమెత్తారు.
రాష్ట్ర విభజన కిరణ్, బాబు వల్లే జరిగిందని రోజా ఆరోపించారు. విభజనకు సహకరించి ప్రజలకు అన్యాయం చేసిన చంద్రబాబుకు ఓట్లు అడిగే హక్కు లేదని అన్నారు. చివరి బంతి వరకూ పోరాడుతానని చెప్పిన కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర ప్రజలకు తీరని ద్రోహం చేశారని రోజా విమర్శించారు.

సమైక్య రాష్ట్రం కోసం పోరాడింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరినే రోజా అన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికెళ్లినా ప్రజలు నీరాజనాలు పడుతున్నారని రోజా తెలిపారు.
కాగా వైయస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన వైయస్సార్ జనభేరిలో భాగంగా శనివారం ఆయన చిత్తూరు జిల్లాలోని తిరుపతికి చేరుకున్నారు. విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగానే శనివారం తిరుమలకు చేరుకుని రోడ్ షో నిర్వహించారు
-
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే..












Click it and Unblock the Notifications