నల్లగా ఉంటే ఇంత వివక్ష!, అమెరికాలో కాదు ఏపీలోనే: ఓ చిన్నోడి నిరసన..
స్కూల్లో తోటి విద్యార్థులంతా కర్రోడా.. నల్లోడా!.. అంటూ తనను హేళన చేస్తున్నారని వీరేశ్ ఆవేదన వ్యక్తం చేశాడు.
మంత్రాలయం: చదువుకోవాల్సిన వయసులో వివక్ష వెన్నాడటం చిన్నారుల మనసులను ఎంతగా కలవరపెడుతుందో తెలియజెప్పే ఘటన ఇది. చీటికి మాటికి తన ఒంటి రంగును హేళన చేసి మాట్లాడే తోటి విద్యార్థుల మధ్య ఆ చిన్నోడు తీవ్రంగా కలత చెందాడు. దీంతో స్కూల్ అంటేనే అతనికి ఏహ్య భావం పుట్టింది.
అయినా సరే.. స్కూల్ కు వెళ్లాల్సిందే అంటూ తల్లిదండ్రులు పట్టుబట్టడంతో.. ఏం చేయాలో తోచని స్థితిలో వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపాడు. కర్నూలు జిల్లా మంత్రాలయంలోని రామచంద్రనగర్ లో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. రామచంద్రనగర్కు చెందిన పోనని వీరేశ్ అనే విద్యార్థి మంగళవారం నాడు వాటర్ ట్యాంక్ ఎక్కాడు. 30అడుగుల ఎత్తున్న ఆ ట్యాంక్ పై నుంచి 'నేను బడికి పోను' అంటూ అరుస్తూ చెప్పాడు. దాదాపు గంట సమయం పాటు వీరేశ్ ఎవరెంత నచ్చజెప్పినా మెత్తబడలేదు. చివరకు పోలీసులు వచ్చి బుజ్జగించడంతో వీరేశ్ కిందకు దిగాడు.
స్కూల్లో తోటి విద్యార్థులంతా కర్రోడా.. నల్లోడా!.. అంటూ తనను హేళన చేస్తున్నారని వీరేశ్ ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో ఇక మీదట ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి పోలీసులు సూచించారు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications