కర్నూల్లో వనరులు, కానీ హక్కులేదు: రాజధాని కమిటీ

ఆగస్టు నెలాఖరున తాము కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర రాజధాని విషయమై నివేదిక ఇస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి తాము రాజధాని పైన అధ్యయనం చేస్తామని చెప్పారు. కానీ, రాజధాని ఎక్కడ ఉండాలి? అనే నిర్ణయించేందుకు తమకు ఏమాత్రం అధికారం లేదని వారు చెప్పారు.
రాజధాని విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఆప్షన్ ఇచ్చి నివేదికను అంద చేస్తామని తెలిపారు. రాజధాని కోసం పూర్తిస్థాయిలో ఏపీలో అధ్యయనం చేస్తామన్నారు. ఆగస్టు నెలాఖరున తాము నివేదిక ఇస్తామన్నారు. ఏపీలోని అన్ని ప్రాంతాలలో పర్యటిస్తామని చెప్పారు.
నిరసనలతో స్వాగతం
కర్నూలులో పర్యటించిన శివరామకృష్ణన్ కమిటీకి నిరసనల స్వాగతం లభించింది. రాయలసీమలోనే రాజధానిని ఏర్పాటు చేయాలని పలువురు నిరసనలు తెలిపారు.












Click it and Unblock the Notifications