పులివెందులలో వైసిపి నేతలకు అవమానం, భయమెందుకు: శ్రీకాంత్ రెడ్డి
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి బుధవారం నాడు నిప్పులు చెరిగారు.
కడప: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి బుధవారం నాడు నిప్పులు చెరిగారు. పులివెందులలో ప్రోటోకాల్ పాటించకుండా తమ పార్టీ నాయకులను అవమానిస్తున్నారని ఆగ్రహించారు.
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన ప్రాజెక్టులనే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తున్నారని ఎద్దేవా చేశారు. 2004 వరకు రాయలసీమలో నిర్మించే ప్రాజెక్టులకు చంద్రబాబు నిధులు ఇవ్వలేదని ఆరోపించారు.

అలాగే, దుమ్ముగూడెం టెయిల్ పాండు ప్రాజెక్టును సాగర్తో అనుసంధానించి రాయలసీమకు 165 టీఎంసీల నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గండికోట రిజర్వాయర్ విషయంలో చర్చకు టిడిపి ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. తాము చెప్పేవి వాస్తవాలు కాదని అధికార పార్టీ చెప్పగలదా అని నిలదీశారు. తెలుగు గంగను పూర్తి చేసింది వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. ప్రాజెక్టుల పైన చర్చకు సిద్ధమని, అలాగే ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు.
-
జగన్ బిగ్ ప్లాన్, 2019 కాంబో రిపీట్ - మారుతున్న లెక్కలు..!! -
కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. -
జగన్కు విజయమ్మ షాక్: నీ చెల్లికి, మేనల్లుడికి అన్యాయం చేశావు -
అవార్డుల గురించి చంద్రబాబుకు పాఠాలు చెప్పిన చిరంజీవి... విన్నారా? -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications