పులివెందులలో వైసిపి నేతలకు అవమానం, భయమెందుకు: శ్రీకాంత్ రెడ్డి
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి బుధవారం నాడు నిప్పులు చెరిగారు.
కడప: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి బుధవారం నాడు నిప్పులు చెరిగారు. పులివెందులలో ప్రోటోకాల్ పాటించకుండా తమ పార్టీ నాయకులను అవమానిస్తున్నారని ఆగ్రహించారు.
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన ప్రాజెక్టులనే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తున్నారని ఎద్దేవా చేశారు. 2004 వరకు రాయలసీమలో నిర్మించే ప్రాజెక్టులకు చంద్రబాబు నిధులు ఇవ్వలేదని ఆరోపించారు.
జగన్ ఇలాకాలో నీటిని విడుదల చేసిన బాబు, నాటకాలని ఆగ్రహం
అలాగే, దుమ్ముగూడెం టెయిల్ పాండు ప్రాజెక్టును సాగర్తో అనుసంధానించి రాయలసీమకు 165 టీఎంసీల నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గండికోట రిజర్వాయర్ విషయంలో చర్చకు టిడిపి ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. తాము చెప్పేవి వాస్తవాలు కాదని అధికార పార్టీ చెప్పగలదా అని నిలదీశారు. తెలుగు గంగను పూర్తి చేసింది వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. ప్రాజెక్టుల పైన చర్చకు సిద్ధమని, అలాగే ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు.