హాల్ టికెట్: ఇంటర్ విద్యార్ధిని ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షలు రాసేందుకు హాల్ టికెట్ ఇవ్వలేదన్న కారణంతో ఓ విద్యార్ధిని ఆత్మహత్యాయత్నం చేసింది. విజయనగరం జిల్లా వేపాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్ధిని ధనలక్ష్మీ, పరీక్షలకు హజరయ్యేందుకు ఈరోజు ఉదయం కళాశాలకు వచ్చింది.
అయితే ఆమెకు కళాశాల సిబ్బంది హాల్ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో తీవ్ర మనస్ధాపానికి గురైన ఆమె కళాశాల ప్రాంగణలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే కళాశాల సిబ్బంది ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇక ఏపీలో బుధవారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,412 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 9,91,006 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో మొదటి సంవత్సరం విద్యార్ధులు 4, 62, 293 మంది కాగా, రెండో సంవత్సరం విద్యార్ధులు 4,71, 086 మంది ఉన్నారు.












Click it and Unblock the Notifications