టీడీపీ ముఖ్య నేతలంతా కేరాఫ్ కుప్పం - చంద్రబాబు తాజా వ్యూహం..!!

ఏపీ రాజకీయం ఇప్పుడు కుప్పం చుట్టుూ తిరుగుతోందది. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని వైసీపీ నేతలు సవాల్ చేస్తున్నారు. సీఎం ఆదేశిస్తే తాను చంద్రబాబుపై పోటీ చేసి గెలుస్తానంటూ మంత్రి పెద్దిరెడ్డి చెబుతున్నారు. కుప్పంలో చంద్రబాబు వరుస పర్యటనలు చేస్తున్నారు. ప్రతీ సారి పర్యటన సమయంలో వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబు వాటిని తనకు అనుకూలంగా మలచుకుంటున్నారు. ఇదే సమయంలో కుప్పంకు ముఖ్య నేతలంతా తరలి రావాలని చంద్రబాబు ఆదేశించారు. వచ్చే ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ కుప్పం కేంద్రంగా కొత్త రాజకీయ అడుగులు ప్రారంభం కానున్నాయి.

ముఖ్య నేతలకు చంద్రబాబు ఆదేశం..

ముఖ్య నేతలకు చంద్రబాబు ఆదేశం..

పార్టీ ముఖ్య నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపైన చర్చించారు. జీవో నెంబర్ 1 జారీ.. హైకోర్టు సస్పెన్షన్.. ఏపీ ప్రభుత్వం సుప్రీంలో అప్పీల్ అంశం పైన ముఖ్య నేతలతో చర్చలు జరిపారు. ఈ నెల 27వ తేదీ నుంచి లోకేష్ ప్రారంభించనున్న యువగళం పైన చర్చ జరిగింది. పాదయాత్ర విజయవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలు.. ప్రభుత్వం నుంచి ఏర్పడే అడ్డంకుల గురించి నేతల మధ్య చర్చ జరిగింది. పార్టీ ముఖ్యులంతా కుప్పంకు తరలి రావాలని చంద్రబాబు ఆదేశించారు. యాత్ర ప్రాధాన్యతను చంద్రబాబు వివరించారు. ముఖ్య నేతలతో పాటుగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల బాధ్యులు పాదయాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనేందుకు కుప్పం రావాలని చంద్రబాబు నిర్దేశించారు.

యాత్రపై పార్టీకి దిశా నిర్దేశం..

యాత్రపై పార్టీకి దిశా నిర్దేశం..

టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలతో టెలి కాన్ఫిరెన్స్ నిర్వహించనున్నారు. లోకేష్ పాదయాత్ర నిర్వహణ.. పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యలపైన ఈ రోజుల నిర్వహించే టెలి కాన్ఫిరెన్స్ లో చంద్రబాబు దిశా నిర్దేశం చేయనున్నారు. అదే సమయంలో రాష్ట్రంలో వర్తమాన రాజకీయాలు..పార్టీ కమిటీల పని తీరు గురించి చంద్రబాబు పార్టీ నేతలకు మార్గనిర్దేశం చేస్తారని సమాచారం. లోకేష్ పాదయాత్ర వ్యూహాత్మకంగా కీలకమైందని..దీనిని విజయవంతం చేయటానికి పార్టీ యంత్రాంగం బాధ్యత తీసుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. జీవో నెంబర్ 1 పైన సుప్రీంకోర్టు ఇవ్వబోయే మార్గదర్శకాల పైన ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి కనిపిస్తోంది. అటు లోకేష్ పాదయాత్రను సక్సెస్ చేయటానికి చంద్రబాబు స్వయంగా పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగిస్తున్నారు.

400 రోజులు.. 4 వేల కిలో మీటర్లు

400 రోజులు.. 4 వేల కిలో మీటర్లు

లోకేష్ పాదయాత్ర ఈ నెల 27న కుప్పం నుంచి యువగళం పేరుతో పాదయాత్ర ప్రారభించనున్నారు. కుప్పంలో ప్రారంభమయ్యే ఈ యాత్ర మూడు రోజుల పాటు అదే నియోజవకర్గంలో కొనసాగనుంది. నిరంతరాయంగా యాత్ర కొనసాగేలా రూట్ మ్యాప్ ఖరారు చేసారు. తాజాగా తన పాదయాత్ర పైన స్పందించిన లోకేష్ తాను యాత్రలో ఉన్నా..మనసంతా మంగళగిరి పైనే ఉంటుందన్నారు. ఈ యాత్రలో ప్రధానంగా యువతను ఆకట్టుకొనేలా కార్యక్రమాలు..అన్ని వర్గాల ప్రజలతో మమేకం అయ్యేలా ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ యాత్ర నారా లోకేష్ రాజకీయ జీవితంలో కీలక మలుపు కు కారణం కానుందనే విశ్లేషణలు మొదలయ్యాయి. దీంతో..స్వయంగా చంద్రబాబు ఈ యాత్ర పైన ఇప్పుడు దిశా నిర్దేశం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+