‘లోకేశ్ కలియుగ అభిమన్యుడు: ఏపీ గురించి జగన్కేం తెలుసు?’
గుంటూరు/విజయవాడ: తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్పై ప్రశంశల వర్షం కురిపిస్తూనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. లోకేష్.. కలియుగ అభిమన్యుడని ఆయన కొనియాడారు.
పద్మవ్యూహాన్ని చేధించడం లోకేశ్కు తెలుసని అన్నారు. పక్కరాష్ట్రాల్లో జీవించే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్కు ఏపీ ప్రజల గురించి మాట్లాడే అర్హతలేదని బుద్దా వెంకన్న విమర్శంచారు.
అంతేగాక, లక్ష్మీ పార్వతి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణపై కూడా మండిపడ్డారు. హరికథలు చెప్పే లక్ష్మిపార్వతిపై, బుర్రకథలు చెప్పే బొత్సపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.

వారు చెల్లని చెక్కులు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు బొత్స, అంబటి రాంబాబు, లక్ష్మీపార్వతి చెల్లని చెక్కు లాంటి వారని టిడిపి ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, జెడ్పీ వైస్ చైర్మన్ వడ్లమూడి పూర్ణచంద్రరావు విమర్శించారు. క్రమశిక్షణ కు మారుపేరైన టీడీపీని విమర్శించే నైతిక హక్కు వైసీపీకి లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎలాంటి పదవులు ఆశించకుండా కార్యకర్తల సంక్షేమం కోసం పనిచేసే వ్యక్తి లోకేష్ అని కొనియాడారు. మైసూరా, సబ్బంహరితో సహా 20 మంది ఎమ్మెల్యేలు జగన్ వైఖరితో పార్టీని వీడిన విషయం వాస్తవం కాదా? అని ఆనందబాబు, వడ్లమూడి పూర్ణచంద్రరావు ప్రశ్నించారు.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications