దూసుకెళ్తున్న టిడిపి, కాంగ్రెస్ జోరు: జగన్, తెరాస స్లో
హైదరాబాద్: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలలో సీమాంధ్రలో తెలుగుదేశం, తెలంగాణలో కాంగ్రెసు పార్టీలు జోరు పెంచాయి. మధ్యాహ్నం సీమాంధ్రలో టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్య పోటా పోటీ కనిపించింది. సాయంత్రానికి టిడిపి దూసుకెళ్తోంది. తెలంగాణలో కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితిల మధ్య కూడా అలాగే పోటీ కనిపించినప్పటికీ ఆ తర్వాత చేతి జోరు పెంచింది.
సీమాంధ్రలో టిడిపి తన స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. సాయంత్రం ఆరు గంటల వరకు వచ్చిన ఫలితాల మేరకు... టిడిపి 2481 ఎంపీటీసీలు, 21 జెడ్పీటీసీలు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 2005 ఎంపీటీసీలు, 12 జెడ్పీటీసులు, కాంగ్రెసు 63 ఎంపీటీసీలను గెలుచుకుంది.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో తెలుగుదేశం, ప్రకాశం, కడప, కర్నూలు జిల్లాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ముందంజలో ఉంది.
తెలంగాణలో కాంగ్రెసు 1151 ఎంపీటీసీలు, 34 జెడ్పీటీసీ, తెరాస 997 ఎంపీటీసీలు, 74 జెడ్పీటీసీలు, టిడిపి 484 ఎంపీటీసీలు, 6 జెడ్పీటీసీలను కైవసం చేసుకుంది. అదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో తెరాస, ఖమ్మం జిల్లాలో టిడిపి, నల్గొండ, మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో కాంగ్రెసులు ముందంజలో ఉండగా.. వరంగల్, నిజామాబాద్లలో తెరాస, కాంగ్రెసు పార్టీల మధ్య పోటా పోటీ కనిపిస్తోంది.
-
ప్రభుత్వ ఉపాధ్యాయులకు డబుల్ శుభవార్తలు చెప్పిన ఏపీ సర్కార్! -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్ -
ఏపీలో రైతులకు క్యూఆర్ కోడ్ తో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ.. చంద్రబాబు తీపికబురు! -
పేటీఎం బ్యాచ్తో నెగిటివ్ రివ్యూలా? వైసీపీకి యాక్టర్ శివాజీ వార్నింగ్ -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications