నాన్నా మాట్లాడు!: కెసిఆర్తో కవిత ముచ్చట(పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు శనివారం తెరాస భవనంలో బంగారు బతుకమ్మ సిడిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటుపై అక్టోబర్ 5లోపు కేబినెట్ నోట్ వచ్చే అవకాశం ఉందని, అప్పటిదాకా ఓపిక పడదామని చెప్పారు.
టీవిలు, సినిమాలు వచ్చాక తెలంగాణ సంస్కృతి కలుషితమైందని అన్నారు. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో వేరు వేరు భాషా మాండలికాలు ఉంటాయన్నారు. ప్రాంతాలను బట్టి యాస, భాష వేర్వేరుగా ఉంటుందన్నారు. తెలంగాణ భాషను, యాసను, సంస్కృతిని కొంతమంది కించపరుస్తున్నారని మండిపడ్డారు.
ఏ ప్రాంతంలోని మాండలికాన్నైనా గౌరవించాలని, తెలంగాణ భాషలో మాట్లాడితే వికారం కాదని, అలా ఆలోచించే వారిదే తప్పన్నారు. తెలంగాణ భాష పైన, సంస్కృతి పైన భయంకరమైన దాడి జరిగిందన్నారు. అక్టోబర్ 4 నుండి 12 వరకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బంగారు బతుకమ్మ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
కెసిఆర్తో కవిత
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతున్న దృశ్యం.
బంగారు బతుకమ్మ
అక్టోబర్ 4 నుండి 12 వరకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరగనున్న బంగారు బతుకమ్మ వాల్ పోస్టర్ విడుదల చేస్తున్న కెసిఆర్, కవిత.
సిడిని చూస్తున్న తండ్రీ కూతురు
బంగారు బతుకమ్మ సిడిలోని పాటల ఇండెక్స్ను చూస్తున్న తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.
సిడి విడుదల
అక్టోబర్ 4 నుండి 12 వరకు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరగనున్న బంగారు బతుకమ్మ సిడిలను విడుదల చేస్తున్న కెసిఆర్, కవిత.
నాన్నా మాట్లాడతారా..!
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతున్న దృశ్యం.
మైస్ సరి చేస్తున్న కవిత
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాట్లాడేందుకు మైకును సరి చేస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.
మాట్లాడుతున్న కెసిఆర్
బంగారు బతుకమ్మ సిడి, పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతున్న తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు.
జై తెలంగాణ
తెలంగాణ భవనంలో జరిగిన బంగారు బతుకమ్మ సిడి, పోస్టర్ ఆవిష్కరణలో జై తెలంగాణ నినాదాలు చేస్తున్న కెసిఆర్, కల్వకుంట్ల కవిత.