రాజధాని రైతులకు జనసేన అండ.... పవన్ కళ్యాణ్... అమరావతిలో పార్టీ బృందం పర్యటన
ఏపీ రాజధానిపై సీఎం జగన్ చేసిన ప్రకటనలతో మరోసారి రాజధాని రగడ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా రాజధాని నిర్మాణంపై అధికార పార్టీ సభ్యులు చేస్తున్న వాదనలను నిజం చేస్తూ...అనధికారికంగా సీఎం జగన్ ఓ ప్రకటన చేసిన విషయం తెలిసిందే...అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ది చెందాలంటే... మూడు రాజధానులు రావచ్చంటూ ఆయన ప్రకటించారు. దీంతో రాజధానిపై అనుకూల వ్యతిరేక వర్గాలు తమ గళాన్ని విప్పుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే అమరావతిలో జనసేన బృందం పర్యటించనున్నట్టు ఆపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. అమరావతిలో నెలకొన్న పరిస్థితులను పరీశీలించేందుకు పార్టీ సీనియర్ నేత నాదేండ్ల మనోహర్ నేతృత్వంలో పార్టీ సభ్యులు పర్యటించనున్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు. శుక్రవారం ఈ బృందం పర్యటించనున్నట్టు పేర్కోన్నారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు, స్థానికుల్లో నెలకొన్న భయాందోళనలను జనసేన బృందం తెలుసుకుంటుందని పవన్ కళ్యాణ్ చెప్పారు.

ఈ నేపథ్యంలోనే రాజధాని ప్రాంత ప్రజలకు జనసేన అండగా నిలబడుతుందని హమీ ఇచ్చారు. కాగా పార్టీ బృందం పర్యటనలో రాజధానిపై నిపుణుల నివేదిక వచ్చే వరకు అనుసరించాల్సిన వ్యూహాలను పార్టీ బృందం, రైతులతో చర్చిస్తుందని పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో పేర్కోన్నారు. కాగా రాజధానిపై సీఎం జగన్ ప్రకటన చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే..ఒక్క రాజధానికే దిక్కు లేనప్పుడు మూడు రాజధానులు ఎలా నిర్మిస్తారని ఆయన ఫైర్ అయ్యారు.
Regarding Amaravati farmers issue: pic.twitter.com/b2JCepxwYr
— Pawan Kalyan (@PawanKalyan) December 18, 2019
Sending our Leaders to meet Amaravati farmers: pic.twitter.com/zK8M5CeTLI
— Pawan Kalyan (@PawanKalyan) December 18, 2019
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications