మహానటి సావిత్రి దాతృత్వానికి అద్దం పట్టే మరో ఘటన:వెలుగులోకి తెచ్చిన నెటిజన్లు
గుంటూరు:అలనాటి మేటి నటి సావిత్రి జీవిత్ర చరిత్ర ఆధారంగా నిర్మించిబడి సూపర్ హిట్ గా నిలిచిన మహానటి చిత్రం ఎందరినో ఆమె గురించిన అనుభవాలు మళ్లీ కలబోసుకునేలా చేస్తోంది. ఆ మహానటి సావిత్రి గురించి తాము విన్న, కన్నఘటనలను గురించి మిగిలినవారితో పంచుకునేందుకు అనేకమంది ముందుకు వస్తున్నారు.
ఈ క్రమంలో సావిత్రి దాతృత్వానికి అద్దం పట్టే మచ్చుతునక లాంటి ఒకనాటి ఘటనను ఎవరో ఆధారంతో సహా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇప్పుడా పోస్ట్ వైరల్ గా మారింది. ఆనాటి పోస్టు ను తాజాగా వెలుగులోకి తేవడం ద్వారా సావిత్రిలోని దాన గుణమే కాదు దేశ భక్తిని తేటతెల్లం చేసిన ఈ పోస్టు అందరి అభిమానాలను చూరగొంటోంది.
ఇంతకూ సావిత్రి దాతృత్వానికి అద్దం పట్టే ఆ ఘటన ఇదే... అది 1965 భారత్ పాక్ మధ్య
రెండవసారి యుద్దం జరుగుతున్న సమయం...

ఆ యుద్ధంలో భారత్ దగ్గర
మందుగుండు సామగ్రి అయిపోయింది...ఆ
నాటి ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి మందుగుండు సామాగ్రి కొనుగోలు కోసం విరాళాలు విరివిగా ఇవ్వమని దేశప్రజలను అభ్యర్థించాడు.
ఆ క్రమంలో...1965 సెప్టెంబర్ నెల...ప్రధాని ఛాంబర్ లోనికి ఆయన గుమస్తా వచ్చి మీ కోసం ఒక దక్షిణాది ప్రముఖ నటిగారు వేచి ఉన్నారని చెప్పాడు...
ప్రధాని శాస్త్రిగారు ఆలోచిస్తూ సరే లోపలికి పంపండి అన్నారు...5 నిమిషాల తర్వాత అప్పటికి సుమారు 28 సంవత్సరాల వయస్సు వున్నఒక అందమైన యువతి చిరునవ్వుతో మొహం కళకళలాడుతుండగా వంటినిండా నగలతో ధగధగలాడుతూ ప్రధాని గారికి నమస్కారం చేస్తూ లోనికి ప్రవేశించింది...ప్రధాని లాల్ బహుదూర్
శాస్త్రిగారికి తాను ఎవరో పరిచయం చేసుకుంది...శాస్త్రిగారూ అభినందన పూర్వంగా నవ్వారు...
ఆ తర్వాత ఆమె తాను వచ్చిన పని చెబుతూ...
తను ధరించిన ఆభరణాలన్నింటిని తీసి
శాస్త్రిగారి టేబుల్ మీద పెడుతూ...
ఇవన్నీ ప్రధాని నిధికి నా వంతు చిన్న సహాయం అని అన్నది...
తాళిబొట్టు తప్ప అన్నీ నిలువుదోపిడీ ఇచ్చిన ఆమె వంక ఆశ్చర్యపోయి చూస్తుండి పోయారు ఆనాటి మన ప్రధానిగారు..
ఆ తర్వాత తేరుకొని ఆనందం నిండిన కళ్ళతో...
"భేటీ నువ్వు మహనీయురాలమ్మా...
నీ దేశభక్తికి అభినందనలు" అన్నారట...
ఆమెతో కరచాలనం చేసి, ఎంతో గౌరవంగా గుమ్మం వరకు వచ్చి సాగనంపారట...!!
ఇంతకూ ఆమె ఎవరో కాదు మన మహానటి సావిత్రినే!...అందుకు ఆధారంగా ఆనాటి ఫోటోను సైతం జతపరిచారు. ఇది ఆమెలోని దాతృత్వానికి అద్దం పట్టడమే కాదు ఆమె లోని దేశభక్తికి నిదర్శనం కూడా.
ఈ ఘటన గురించి సోషల్ మీడియాలో పోస్టు చేయబడిన కథనం ఇది. అయితే ఇది యథాతథంగా అలాగే జరిగి ఉండకపోవచ్చు...ఎందుకంటే ఇందుకు సంబంధించిన చిత్రంలో జెమినీ గణేషన్ తో పాటు శివాజీ గణేషన్ కూడా ఉండటం మన గమనించవచ్చు. అయితే వారిద్తరూ తమిళ నటులు కాగా వారితో పాటు మన మహానటి సావిత్రి మాత్రమే ఉండి ప్రధాని ఆభరణాలు నిలువు దోపిడీ దానంగా ఇవ్వడం ద్వారా ఆ ఘటన, అందుకు సంబంధించిన పూర్వాపరాలు మాత్రం వాస్తవమేనని అర్థం చేసుకోవచ్చు.
-
ఇన్స్టాగ్రామ్ యూజర్లకు బిగ్ షాక్.. -
పాక్ ఇన్ఫ్లూయెన్సర్ సిగ్గుమాలిన పని.. 9వ తరగతి బాలికతో ఐదో పెళ్లి! -
"గోంగూర మష్రూమ్ కర్రీ" ఇలా చేస్తే స్వర్గమే !! -
ఈ గ్రూపు ఫోటోలో ఉన్న మంత్రగత్తెని కనిపెట్టగలరా..? -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications