మిత్రుడి ఎదుటే అమ్మాయిపై రేప్: ఇద్దరి అరెస్టు
హైదరాబాద్: చదువు కోసం ఇంటికి రావాలని పిలిచి ఓ అమ్మాయిపై తన అసోసియేట్ ఎదుటే అత్యాచారం చేసిన కేసులో సికింద్రాబాదులోని అల్వాల్లో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఏప్రిల్ 29వ తేదీన ఈ సంఘటన జరిగింది.
17 బాలికపై అత్యాచారం కేసులో బొల్లారం పోలీసులు బిటెకె విద్యార్థిని, అతని మిత్రుడిని అరెస్టు చేశారు. 22 ఏళ్ల ఫరూఖ్ అనే యువకుడిని, అతని 17 ఏళ్ల మిత్రుడిని పోలీసులు అరెస్టు చేశారు. 17 ఏళ్ల ఫరూఖ్ మిత్రుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు.
బాధితురాలు ఆల్వాల్లోని మాజీ సైనికోద్యోగి కూతురు. చదువుకోవడానికి రావాలని పిలిచి ఏప్రిల్ 29వ తేదీన అమ్మాయిపై మిత్రుడి సమక్షంలో అత్యాచారం చేశాడు. విషయాన్ని అమ్మాయి తన తండ్రికి చెప్పింది. దీంతో అతను ఆ ఇద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
వారిద్దరిని పోలీసులు ఆదివారంనాడు అరెస్టు చేశారు. బాధితురాలని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.