జగన్పార్టీలోకి వనమా? కృష్ణ హెచ్చరిక, సూసైడ్యత్నం

అయితే వనమా వెంకటేశ్వర రావు రాకను యడవల్లి కృష్ణ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ వ్యతిరేకిస్తుండటంతో వనమా, యడవల్లితో జగన్ సమావేశం కానున్నారని సమాచారం. వనమా వస్తే తాను పార్టీని వీడుతానని యడవల్లి స్పష్టం చేశారు. మరోవైపు జగన్ పార్టీలో వనమా రాకను వ్యతిరేకిస్తూ జిల్లాలో ఇద్దరు మహిళలు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
కాగా, గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ఇరు వర్గాలకు చెందిన పలువురు గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు ధూళిపాళ్లకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications