బాబు వస్తే బాదుడే, అప్పుడలా..ఇప్పుడిలా: వాసిరెడ్డి
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఏపి సిఎం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఛార్జీల బాదుడే అని మరోసారి రుజువైందని అన్నారు.
విద్యుత్ ఛార్జీల పెంపును తక్షణమే ఉపయోగించుకోవాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ మాట.. అధికారంలోకి వచ్చిన తర్వాత మరోమాట మాట్లాడుతున్నారని ఆరోపించారు.

కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు రాబట్టడంలో తెలుగుదేశం ప్రభుత్వం విఫలమైందని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన చంద్రబాబు.. ఇప్పుడు ఎందుకిలా వ్యవహరిస్తున్నారంటూ ప్రశ్నించారు.
ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చకోకపోతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని వాసిరెడ్డి పద్మ చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఇది ఇలా ఉండగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ను కలిశారు. ఆముదాల వలస నియోజకవర్గంలో స్థానిక ప్రజాప్రతినిధులను ప్రభుత్వ కార్యక్రమాల నుంచి విస్మరించడంలో మండల అధికారులపై ఫిర్యాదు చేశారు.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications