వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు వస్తే బాదుడే, అప్పుడలా..ఇప్పుడిలా: వాసిరెడ్డి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఏపి సిఎం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఛార్జీల బాదుడే అని మరోసారి రుజువైందని అన్నారు.

విద్యుత్ ఛార్జీల పెంపును తక్షణమే ఉపయోగించుకోవాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ మాట.. అధికారంలోకి వచ్చిన తర్వాత మరోమాట మాట్లాడుతున్నారని ఆరోపించారు.

Vasireddy criticizes on Chandrababu

కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు రాబట్టడంలో తెలుగుదేశం ప్రభుత్వం విఫలమైందని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన చంద్రబాబు.. ఇప్పుడు ఎందుకిలా వ్యవహరిస్తున్నారంటూ ప్రశ్నించారు.

ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చకోకపోతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని వాసిరెడ్డి పద్మ చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఇది ఇలా ఉండగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ను కలిశారు. ఆముదాల వలస నియోజకవర్గంలో స్థానిక ప్రజాప్రతినిధులను ప్రభుత్వ కార్యక్రమాల నుంచి విస్మరించడంలో మండల అధికారులపై ఫిర్యాదు చేశారు.

English summary
YSR Congress Party spokesperson Vasireddy on Friday criticized at Andhra Pradesh CM Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X