నేను వెళ్ల: జగన్పై విహెచ్ జోస్యం, పెదవి విరిచిన గండ్ర
వరంగల్/హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన అందిస్తానంటే ఎవరు నమ్మరని, అవినీతిపరుడు అయిన జగన్ ఎప్పటికీ సిఎం కాలేడని రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు శుక్రవారం మండిపడ్డారు. తాను సీమాంధ్రలో ప్రచారానికి వెళ్లనని చెప్పారు. అత్యంత అవినీతిపరుడైన జగన్ ముఖ్యమంత్రి కావాలనుకోవడం హాస్యాస్పదమన్నారు.
జగన్ ఎన్నటికీ సిఎం కాలేడన్నారు. అంబర్పేట నియోజకవర్గ పరిధిలోని పోలీసులు పక్షపాతంగా వ్యవహరించారని ఆరోపించారు. బిజెపి అభ్యర్థి కిషన్ రెడ్డికి అనుకూలంగా పని చేశారన్నారు. తాను ఎవరిపైనా దాడి చేయలేదని, తనపై తప్పుడు కేసు బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఇష్టారీతిగా వ్యవహరించారన్నారు.

పెదవి విరిచిన గండ్ర
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణను కాంగ్రెస్ పార్టీనే ఇచ్చిందన్న సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తాము కొంతవరకు విఫలమయ్యామన్నారు. రాష్ట్ర స్థాయిలో బలమైన నాయకత్వం లేకపోవడమేనని దీనికి కారణమన్నారు.
ఏదేమైనప్పటికీ, అనుకున్నన్ని స్థానాలను సొంతం చేసుకోలేకపోయినా... అధికారంలోకి రావడం మాత్రం ఖాయమన్నారు. ప్రజలు కెసిఆర్ మేనిఫెస్టోను నమ్మారు తప్పితే కాంగ్రెసు మేనిఫెస్టోను నమ్మలేదన్నారు. స్టార్ కంపెయినర్లు లేరన్నారు. ఫలితాలకు రాష్ట్ర నాయకత్వమే బాధ్యత వహించాలన్నారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications