చినరాజప్ప-హర్షకుమార్ ల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం
రాజమండ్రి:టిడిపి నిర్వహించిన దళిత తేజం కార్యక్రమంపై హోంమంత్రి చినరాజప్ప...మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఆదివారం చినరాజప్ప తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు హర్షకుమార్ కౌంటరిచ్చారు.
Recommended Video

కాంగ్రెస్ హయాంలో దళిత సంక్షేమానికి ఖర్చు చేయాల్సిన నిధులను పక్కదోవ పట్టించిన సంగతి హర్షకుమార్ తెలుసుకోవాలని చినరాజప్ప వ్యాఖ్యానించగా, పదేళ్ల కాంగ్రెస్ హయాంలో దళితులకు జరిగిన మేలుపై రాజప్పతో బహిరంగ చర్చకు తాను సిద్ధమని హర్షకుమార్ సవాల్ విసిరారు. కాంగ్రెస్ హయాంలో ఎస్సీ-ఎస్టీ సబ్ ప్లాన్ కు చట్టబద్ధత కల్పించామన్నారు.

టిడిపి దళిత తేజం కార్యక్రమంపై హర్షకుమార్ విమర్శలపై స్పందించిన హోం మంత్రి చినరాజప్ప ఆయనపై మండిపడ్డారు. దళిత తేజం నిర్వహించే అర్హత టీడీపీకి లేదన్న హర్షకుమార్ కు...దళితుల గురించి మాట్లాడేందుకు ఆయనకు ఏ అర్హత ఉందని చినరాజప్ప ప్రశ్నించారు. గతంలో ఎస్సీ, ఎస్టీ నిధులను ఇతర పనులకు మళ్లిస్తే హర్షకుమార్ ఏం చేశారని నిలదీశారు.
దీంతో తనను ఉద్దేశించి చినరాజప్ప చేసిన వ్యాఖ్యలపై హర్షకుమార్ ఘాటుగా ప్రతిస్పందించారు. దళితులకు 40 వేల కోట్లు కేటాయించామని గొప్పగా చెబుతున్న టిడిపి...ఆనాడు తాము చేసిన చట్టంవల్లే ఆ విధంగా 40 వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని హర్షకుమార్ చెప్పారు. దళిత వ్యతిరేకిగా వ్యవహరిస్తోన్న టీడీపీకి ప్రజలే బుద్ధిచెబుతారని అన్నారు.
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..!












Click it and Unblock the Notifications