టిడిపి కొత్త వాదన!: మోడీ వద్దకు.. చిరంజీవి-పవన్ కళ్యాణ్ కలిసేనా?
విజయవాడ: ప్రత్యేక హోదా విషయమై జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమను నిలదీసిన నేపథ్యంలో టిడిపి (కొంతమంది) ఆయన పైన ఎదురు దాడికి దిగారు. ప్రత్యేక హోదా అంశంపై తమను తప్పు పట్టడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా కేంద్రం పరిధిలోని అంశమని, నాడు బీజేపీ నేతలు హామీ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. కేంద్రం పైన ఒత్తిడి తేవాలని అంటున్నారు. అందుకోసం అవసరమైతే అందరం కలిసి పోరాడుదామని చెబుతున్నారు. ఈ సందర్భంగా టిడిపి నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు.
ప్రత్యేక హోదా కోసం పవన్ కళ్యాణ్ ఉద్యమిస్తానంటే తాను చంద్రబాబుకు కటీఫ్ చెప్పి తాను ఆయన పక్కన చేరిపోతానని రెండు రోజుల క్రితం జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఎంపీలు అవంతి శ్రీనివాస్, కేశినేని నాని కూడా అవే వ్యాఖ్యలు చేశారు. తమను టార్గెట్ చేసినందుకు కొందరు ఎంపీలు ఆయన పైన దుమ్మెత్తి పోశారు.

తాజాగా, టిడిపి నేతలు మరో ఆసక్తికర వాదన తెరపైకి తెచ్చారు. హోదా కోసం తాము పోరాటం చేస్తున్నామని, అవసరమైతే పదవులకు కూడా రాజీనామా చేస్తామని చెబుతున్న ఎంపీలు.. ఈ అంశంపై కాంగ్రెస్ నేత చిరంజీవి, పవన్ కళ్యాణ్లు తమతో కలిసి వస్తే మరోసారి ప్రధాని మోడీని కలుద్దామని చెప్పారు. హోదా కోసం పలుమార్లు ప్రధానిని కలిశామని, సీఎం చంద్రబాబు కూడా కలిశారని చెబుతున్నారు.
అన్నదమ్ములుగా ఒక్కటే, రాజకీయ దారులు వేరు.. మరి!
కుటుంబ సభ్యులుగా, అన్నదమ్ములుగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్య ఎలాంటి విభేదాలు లేవు. కానీ రాజకీయంగా మాత్రం వేర్వేరు దారులు. ఈ విషయాన్ని పవన్ చెప్పారు. అయితే, హోదా మాత్రం ఏపీకి సంబంధించిన అంశం. ఆరు కోట్ల మంది ప్రజలకు సంబంధించిన అంశం. కాబట్టి హోదా కోసం ఇరువురు కలుస్తారా చూడాలని అంటున్నారు. హోదా కోసం తాను ఏ పార్టీతోనైనా కలుస్తానని పవన్ చెప్పారు.
-
చిరంజీవికి ఎన్టీఆర్ అవార్డు.. అట్టహాసంగా గద్దర్ అవార్డ్స్ -
'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీలో శ్రీలీల పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..? -
సొంత సినిమాను వదిలేసి పరాయి సినిమాకు భజనా? -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
ఉస్తాద్కు బిగ్ షాక్...తొలి రోజే ఆన్లైన్లో HD ప్రింట్ ప్రత్యక్షం! -
అన్న మళ్లీ హిట్ కొట్టాడోచ్.. పవన్ కళ్యాణ్ "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ రివ్యూ..! -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!!












Click it and Unblock the Notifications