అవిశ్వాసానికి దూరం: కిషన్ రెడ్డి, వెంకయ్యతో టిడిపి భేటీ

 will not support No confidence motion: Kishan Reddy
హైదరాబాద్: తమ పార్టీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వబోదని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అవిశ్వాసానికి బిజెపి మద్దతు ఇస్తుందని కొన్ని రాజకీయ పార్టీలు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. అవిశ్వాసం పెట్టి పడగొట్టినా, అవిశ్వాసం ప్రతిపాదించకపోయినా యుపిఎ ప్రభుత్వం ఉండేది మూడు నెలలే అని ఆయన అన్నారు.

యుపిఎ ప్రభుత్వం ప్రజల మద్దతు కోల్పోయిందని, అందువల్ల ప్రత్యేకంగా పనిగట్టుకుని ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా పెట్టే ఏ అవిశ్వాసానికైనా తమ పార్టీ మద్దతు ఇవ్వదని ఆయన అన్నారు. కేవలం రోజులు లెక్కపెట్టే ప్రభుత్వంగా యుపిఎ మారిందని ఆయన అన్నారు.

రాష్ట్రంలో ఆధిపత్యం కోసం జరుగతున్న ఆరాటమే తప్ప ఇది సమైక్యవాదం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్వార్థ రాజకీయాలకోసం ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆయన విమర్శించారు. అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తే చర్చలో కచ్చితంగా పాల్గొంటామని, యుపిఎ విధానాలను ఎండగడుతామని ఆయన అన్నారు.

ఇదిలావుంటే, ఢిల్లీలో బిజెపి సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడిని తెలుగుదేశం సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు కలిశారు. బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీతో కూడా వారు సమావేశమయ్యారు. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, శివప్రసాద్, కొనకళ్ల నారాయణ వారిని కలిశారు. తాము ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని వారు బిజెపి అగ్రనేతలను కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+