వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శాలరీ పెంచండి: ఎమ్మెల్యేలు, చేతులెత్తేసిన యనమల

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: శాసన సభ్యుల వేతనాలు పెంచాలని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడిని పలువురు ఎమ్మెల్యేలు మంగళవారం కోరారు. యనమలను కలిసిన ఎమ్మెల్యేలు.. తమ జీతాలు పెంచాలని విజ్ఞప్తి చేశారు. దానికి యనమల స్పందిస్తూ.. ప్రస్తుత పరిస్థితుల్లో జీతాలు పెంచలేమని తేల్చి చెప్పారు. చిదంబరం, సుశీల్ కుమార్ షిండే.. తదితర కాంగ్రెస్ పార్టీ నేతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలన్నారు.

రాజీనామా చేయాలి: పల్లె

ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానంపై ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్రమంత్రి పల్లె రఘునాథ రెడ్డి డిమాండ్‌ చేశారు. మంత్రి పల్లె అసెంబ్లీ ఆవరణలో విలేకరులతో మాట్లాడారు.

Yanamala not ready to increase MLAs salaries

కాంగ్రెస్‌ పార్టీ ఏపీకి తీరని అన్యాయం చేసిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించటానికి ఏపీ సీఎం చంద్రబాబు చిత్తశుద్ధితో ఉన్నారన్నారు. యూపీఏ విధానాల వల్ల ఏపీ వెంటిలేటర్‌పై ఉందని, వీరప్ప మొయిలీకి ఏపీ ప్రజల ఉసురు తగులుతుందన్నారు.

రామానాయుడు మృతి పట్ల ఏపీ అసెంబ్లీ సంతాపం

ఇటీవల మృతి చెందిన టాలీవుడ్ ప్రముఖ నిర్మాత రామానాయుడు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ శాసన సభ సంతాపం తెలిపింది. అనంతరం పట్టిసీమ ప్రాజెక్టు పైన చర్చ ప్రారంభించింది.

English summary
Yanamala Ramakrishnudu is not ready to increase MLAs salaries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X