ముంబై వెళ్లి గంట కొట్టి రావడానికి లక్షల ఖర్చా? అనుకూల మీడియాతో చంద్రబాబు దుష్ప్రచారం:ఎమ్మెల్యే ఆళ్ల
విజయవాడ:మంగళగిరి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు, టిడిపి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విజయవాడ లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆర్కే విలేకరులతో మాట్లాడారు.
చంద్రబాబు నువ్వు ముంబై వెళ్లి గంట కొట్టి రావడానికి లక్షల రూపాయల ఖర్చా?...నీ మంత్రి పుచ్చి పోయిన పంటికి వైద్యం చేయించుకోవడానికి లక్షల రూపాయల ఖర్చా?...ఇలా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని నువ్వు ఇష్టానుసారంగా ఖర్చుపెట్టడం సబబేనా చంద్రబాబూ అని మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. పార్క్ హయత్ హోటల్లో నీ కుటుంబానికి మూడు సూట్లు బుక్ చేసి ప్రభుత్వ సొమ్ము దుబారా చేయడం వాస్తవం కాదా?... అని ఆర్కే నిలదీశారు.

మోసాలే...చంద్రబాబు నైజం
చంద్రబాబు మైండ్ పనిచేయటం లేదని...తెల్లారి లేస్తే అబద్ధాలు ఆడటం, మోసాలు చేయడమే బాబు నైజమని ఆర్కే విమర్శించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఎందుకు అనర్హులను చేయరని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ బులెటిన్లో ఇప్పటికీ ఫిరాయింపు ఎమ్మెల్యేలని మా పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్స్గా చూపుతున్నారని వెల్లడించారు.

జీతాల గురించి...ఆ హక్కు లేదు
మా జీతాల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని, నువ్వు తప్పు చేసినట్లు లెంపలేసుకోవాలని చంద్రబాబుకు ఆర్కే హితవు పలికారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు జగన్ ఇచ్చిన బీఫారం మీద గెలిచిన సంగతి గుర్తు లేదా అని ప్రశ్నించారు.

ఆ సంగతి...గుర్తు లేదా?
చంద్రబాబు చెప్పటానికే నీతులు..ఆచరణలో మాత్రం శూన్యమన్నారు. చంద్రబాబు గతంలో పాదయాత్ర చేస్తూ అసెంబ్లీకి వెళ్లకుండా జీతం తీసుకున్న సంగతి గుర్తులేదా అని సూటిగా అడిగారు. జీతం అనేది ఎమ్మెల్యేలకు రాజ్యాంగం కల్పించిన హక్కు, అసెంబ్లీకి వెళ్తే ఇచ్చేది కేవలం భత్యమే అని ఆర్కే వివరించారు.

స్పీకర్ నుంచి...తప్పించండి
ఫిరాయింపుల అంశం స్పీకర్ పరిధి నుంచి తప్పించాలని ఆర్కే డిమాండ్ చేశారు. జగన్ సభకు వస్తే హడావుడిగా ముగిస్తారు..ఇప్పుడు వారం రోజులు శాసనసభ నిర్వహిస్తారా?...అని నిలదీశారు. ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన అనుకూల మీడియా ద్వారా తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆర్కే ఆరోపించారు.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications