నేను అలా చెప్పను, ఏడవొద్దమ్మా!: జగన్ (పిక్చర్స్)
హైదరాబాద్: తమ పార్టీ అధికారంలోకి వస్తే సీమాంధ్రలో సింగపూర్ లాంటి నగరాన్ని నిర్మిస్తానని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు.
విజయనగరం జిల్లా చీపురుపల్లిలో శనివారం రాత్రి జరిగిన ఎన్నికల ప్రచారసభలో ఆయన ప్రసంగిస్తూ 20 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేసి, వాటిని ప్రతి జిల్లా కేంద్రానికి అనుసంధానం చేస్తానని తెలిపారు.
వీటి ద్వారా పేదవాడికి కూడా కార్పొరేట్ వైద్యం అందుతుందన్నారు. చంద్రబాబులా అమలు సాధ్యం కాని హామీలను ఇవ్వడం తనకు చేతకాదని చెప్పారు.

నేను అలా చెప్పను, ఏడవొద్దమ్మా!: జగన్ (పిక్చర్స్)
ఇంటికో ఉద్యోగమిస్తానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని వైయస్ జగన్ విమర్శించారు.

నేను అలా చెప్పను, ఏడవొద్దమ్మా!: జగన్ (పిక్చర్స్)
తాను అలాంటి హామీలను ఇవ్వను కానీ, యువతకు ఉపాధిపై భరోసా కల్పిస్తానని చెప్పారు. నిరంతర విద్యుత్ సరఫరాకు ప్రాధాన్యమిస్తానని జగన్ తెలిపారు.

నేను అలా చెప్పను, ఏడవొద్దమ్మా!: జగన్ (పిక్చర్స్)
వ్యవసాయానికి పగటి వేళ కూడా నాణ్యమైన విద్యుత్ను అందిస్తానని జగన్ చెప్పారు. తెలుగు జాతి సమైక్యతకు తమ పార్టీ కట్టుబడి ఉందని చెబుతూ ప్రాంతానికో మాట మాట్లాడడం తనకు చేతకాదని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు.

నేను అలా చెప్పను, ఏడవొద్దమ్మా!: జగన్ (పిక్చర్స్)
నిజాయితీగల నేతలను ఎన్నుకోవాలని కోరారు. చీపురుపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా బెల్లాన చంద్రశేఖర్, విజయనగరం ఎంపీ అభ్యర్థిగా బేబీనయనను జగన్ ప్రకటించారు.

నేను అలా చెప్పను, ఏడవొద్దమ్మా!: జగన్ (పిక్చర్స్)
కడప జిల్లా వల్లూరు రోడ్ షోలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ మాట్లాడుతూ... జగన్ ముఖ్యమంత్రి అయితే రామరాజ్యం వస్తుందని చెప్పారు.

నేను అలా చెప్పను, ఏడవొద్దమ్మా!: జగన్ (పిక్చర్స్)
చేనేత కార్మికులకు సబ్సిడీపై నూలు అందించి, నేతన్నల ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేస్తామన్నారు. డ్వాక్రా రుణాలను రూ.20 వేల కోట్లు మాఫీ చేస్తారన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే బెల్టు షాపులు రద్దు చేస్తామని విజయమ్మ చెప్పారు. ఆరోగ్యశ్రీ, 108, 104లను ప్రతి గ్రామానికి వెళ్లేటట్లు చూస్తామని భరోసా ఇచ్చారు.












Click it and Unblock the Notifications