జగన్ అక్రమాస్తుల కేసులో శ్యాంబాబుపై కేసు కొట్టివేత
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో భాగంగా లేపాక్షి నాలెడ్జ్ హబ్కు సంబంధించి అప్పటి ఐఏఎస్ అధికారి బి శ్యాంబాబుపై సీబీఐ నమోదు చేసిన కేసును శుక్రవారం ఉమ్మడి హైకోర్టు కొట్టివేసింది.
ప్రాసిక్యూషన్కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి లేనందున శ్యాంబాబుపై కేసును కొట్టివేస్తున్నట్లు పేర్కొంది. ప్రాసిక్యూషన్కు ప్రభుత్వాలు నిరాకరించినపుడు, వాటిని ప్రాసిక్యూషన్ సంస్థ న్యాయస్థానాల్లో సవాలు చేయాలని, అలాకాకుండా పదవీ విరమణ తరువాత విచారణ చేపట్టడం సరికాదని పేర్కొంది.

ఇది వేధింపులకు గురి చేయడమేనన్న సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం శాంబాబుపై కేసును కొట్టివేస్తున్నట్లు తెలిపింది. ఈమేరకు శుక్రవారం న్యాయమూర్తి జస్టిస్ సీతారాంమూర్తి తీర్పు వెలువరించారు.












Click it and Unblock the Notifications