నెల్లూరులో వైయస్, ఖనిలో అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం
నెల్లూరు/కరీంనగర్: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని వరికుంటపాడు మండలం రామాపురం సెంటరులో శనివారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అనంతరం దానికి నిప్పు పెట్టారు.
ఈ విషయం తెలిసిన వెంటనే వరికుంటపాడు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. విగ్రహం కాలిపోతుండటంతో మంటలు ఆర్పివేశారు. ఈ ఘటన పైన విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

గోదావరిఖనిలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ ఆంబేడ్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో పలు దళిత సంఘాలు, అంబేడ్కర్ వాదులు ఆందోళన చేపట్టారు. అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని, వారిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. శ్రీపాద రావు విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారు.
యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు వంశీచంద్ రెడ్డిని పోలీసులు హైదరాబాదులో అరెస్ట్ చేశారు. వంశీచంద్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి స్థానం నుంచి పోటీ చేశారు. అయితే, వెల్దండ మండలంలో రేపు రీపోలింగ్ జరగనుండడంతో ముందస్తుగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు బిజెపి అభ్యర్థి ఆచారీని కూడా అదుపులోకి తీసుకున్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications