'బాబు దోస్తుంటే, లోకేష్ దాస్తున్నారు': 'జగన్ టార్గెట్తో బడ్జెట్ పట్టించుకోని సీఎం'
విజయవాడ: ఏపీలో దాచుకో - దోచుకో పథకాన్ని అమలు చేస్తున్నారని వైసిపి ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్ర స్వామి మంగళవారం నాడు ఆరోపించారు. పెదబాబు చంద్రబాబు దోస్తుంటే, చినబాబు లోకేష్ దాస్తున్నారని ఆయన మండిపడ్డారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ పెద్దలే ఇసుకను దోచుకున్నారన్నారు. ఇక ఉచిత ఇసుకతో కార్యకర్తలు దోచుకునేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. ఏపీకి బడ్జెట్లో తీవ్ర అన్యాయం జరిగిందని, అయినప్పటికీ టిడిపి నేతలు నోరు మెదపడం లేదన్నారు.

ఎమ్మెల్యేల చేరిక బిజీతో బడ్జెట్ను పట్టించుకోని సీఎం
ఎమ్మెల్యేల చేరికలతో బిజీగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు బడ్జెట్ విషయమై పట్టించుకోలేదని ఏపీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి విజయవాడలో ఎద్దేవా చేశారు. బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేతలు విజయవాడలో ఆందోళన నిర్వహించారు.
ఏలూరు రోడ్డులో కేంద్రం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రఘువీరా రెడ్డి మాట్లాడారు. ఎమ్మెల్యేల చేరికలతో బిజీగా ఉన్న చంద్రబాబు బడ్జెట్ను పట్టించుకోలేదని, బడ్జెట్కు ముందు ఎంపీలను కేంద్రం వద్దకు పంపించలేదన్నారు.
అందుకే న్యాయపరంగా కేటాయింపులు జరగలేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.1200 కోట్లు అడిగితే రూ.100 కోట్లు మాత్రమే కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు, మోడీలు దగా, వంచన చేస్తున్నారన్నారు. ఈ జోడీ వంచన జోడీ అన్నారు. సీఎం, పీఎం వైఖరితో బడ్జెట్లో ఏపీ నష్టపోయిందన్నారు. ఈ ఆందోళనలో రఘువీరాతో పాటు దేవినేని నెహ్రూ, మల్లాది విష్ణులు పాల్గొన్నారు. ఆందోళన నేపథ్యంలో ట్రాఫిక్ జాం అయింది.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications