మన సంప్రదాయం: కోడి పందేలపై మోహన్ బాబు కీలక వ్యాఖ్యలు
చిత్తూరు: సంక్రాంతి పండగ అంటేనే కోడి పందేలు గుర్తువస్తాయి. పోలీసులు అడ్డుకుంటున్నప్పటికీ ఏదో ఒక చోట జరుగుతూనే ఉంటాయి. తాజాగా, ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు కోడిపందేలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు నిర్వహించడం మన సంప్రదాయంగా వస్తోందన్నారు .కత్తులు, కట్టకుండానైనా పందేలు నిర్వహిస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. తిరుపతి శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల ఆవరణలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన భోగి సంబరాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అందరూ కలిసి కట్టుగా సంక్రాంతి పండగను సంతోషంగా జరుపుకోవాలన్నారు. మంచు విష్ణు మాట్లాడుతూ.. ప్రతి ఏడాదిలానే ఈ సంవత్సరం కూడా ఇక్కడ భోగి సంబరాలు జరుపుకుంటున్నామని తెలిపారు. భోగి పండగ రోజు సందర్భంగా కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లాలన్నారు.
కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు నిర్వహిస్తారు. కోట్లలో లావాదేవీలు జరుగుతుంటాయి. అయితే, పోలీసులు కోడి పందేలకు అనుమతి లేదని అంటున్నారు. కోడిపందేలు నిర్వహించేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
-
తిరుపతికి వెళ్లే ఈ ప్రధాన రైళ్లల్లో కీలక మార్పులు, ఇక నుంచి..!! -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో












Click it and Unblock the Notifications