లోకసభ ఎన్నికలు 2019 : చిత్తూరు నియోజకవర్గం గురించి తెలుసుకోండి
Recommended Video

కలియుగ వైకుంఠం తిరుపతితోపాటు చిత్తూరు జిల్లాలోని మరో పార్లమెంట్ స్థానం చిత్తూరు లోక్సభ నియోజకవర్గం. ప్రస్తుతం ఈ స్థానం నుంచి డాక్టర్ ఎన్ శివప్రసాద్ ఎంపీగా కొనసాగుతున్నారు. 2014 మే 18 తేదీ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పార్లమెంట్లో ఎంపీగా రెండోసారి సేవలందిస్తున్నారు. వృత్తిరీత్యా డాక్టర్. చిత్తూరు జిల్లా తిరుపతిలోని ఎస్వీ మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పట్టాను అందుకొన్న శివప్రసాద్ వయస్సు 67 సంవత్సరాలు.
2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన డాక్టర్ ఎన్ శివప్రసాద్ తన సమీప ప్రత్యర్థి, వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి జీ సామాన్య కిరణ్పై 44138 ఓట్ల తేడాతో విజయం సాధించారు. శివప్రసాద్కు 594,862 ఓట్లు పోలవ్వగా, సామాన్య కిరణ్కు 550,724 ఓట్లు వచ్చాయి.
పార్లమెంట్లో పలు అంశాలపై జరిగిన చర్చల్లో శివప్రసాద్ విరివిగా పాలుపంచుకొన్నారు. ప్రస్తుత పార్లమెంట్లో 86 ప్రశ్నలను ఆయన సంధించారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన చర్చల్లో 242 సార్లు, దేశానికి సంబంధించిన చర్చల్లో 273 సార్లు పాలుపంచుకొన్నారు. పార్లమెంట్లో ఆయన హాజరు శాతం 45 కాగా, అందులో 77 శాతం మేర రాష్ట్రానికి సంబంధించిన చర్చల సందర్బంగా లోక్సభకు హాజరయ్యారు.

చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 1,452,141 ఓటర్లు ఉండగా, అందులో 723,996 మంది పురుషులు, 728,145 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 2014 ఎన్నికల్లో 1,198,915 మంది ఓటు వినియోగించుకొన్నారు. మొత్తం 83 శాతం ఓటింగ్ నమోదైంది. అందులో 598,259 మంది పురుషులు, 600,656 మంది మహిళలు ఓటు హక్కును వినియోగించుకొన్నారు.
చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 2,031,588 జనాభా ఉంది. అందులో 77.64% మేర గ్రామీణ ప్రజలు, 22.36% మేర పట్టణ ప్రజలు ఉన్నారు. జనాభాలో 21.67 శాతం కాగా, 3.14 శాతం ఎస్టీలు ఉన్నారు. చిత్తూరు లోక్సభ నియోజకవర్గానికి రూ.26.8 కోట్లు మేర ఎంపీ లాడ్స్ మంజూరు కాగా, వాటిలో రూ.19.32 కోట్ల మేర అభివృద్ధి పనులకు వినియోగించారు.












Click it and Unblock the Notifications