రోడ్డుపై లారీ బోల్తా: చేపల కోసం ఎగబడ్డ జనం, ఎక్కడ అంటే..?
కొందరు జనం మారడం లేదు. అవును పక్క వారు ఆపదలో ఉన్నా సరే పట్టించుకోవడం లేదు. తమకు ఫ్రీగా వస్తే చాలు అనుకుంటున్నారు. అవును ఏలూరులో ఇలాంటి ఘటన జరిగింది. చేపల లోడ్తో వెళ్తున్న లారీ జీలుగుమిల్లి మండలం దర్భగూడెంలో బోల్తా పడింది. లారీ కింద పడటంతో అందులో ఉన్న చేపలు రోడ్డు మీద పడ్డాయి. విషయం తెలిసిన స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు.
రమాదంలో ఎవరైనా చిక్కుకున్నారేమో అని కూడా పట్టించుకోలేదు. లారీ డ్రైవర్, క్లీనర్ బతికున్నారా లేదా అని చూడలేదు. వారి చూపంతా చేపల మీదే ఉంది. రోడ్డు మీద పడిన చేపల కోసం జనాలు ఎగబడ్డారు. చేపలను సంచుల్లో వేసుకోవడంలో బిజీ అయిపోయారు. దీంతో హవ్వా ఇదేం పని అని మిగతా వారు అనుకుంటున్నారు.
కర్ణాటక నుంచి వెస్ట్ బెంగాల్కు చేపల లోడ్తో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్, క్లీనర్కు గాయాలు కావడంతో పోలీసులు వారిని జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి తరలించారు. రోడ్డు మీద పడిన చేపలను సంచులు తెచ్చుకుని మరీ తీసుకుపోయారు. ఇలా చేపల కోసం ఎగబడటం ఆందోళనకు గురి చేస్తోంది. మనిషిలో మానవత్వం లేకుండా పోయింది.
ఇప్పుడే కాదు.. ఇదివరకు కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. అవును కొందరు జనం చేపలను ఎగబడి మరీ తీసుకున్నారు. అప్పట్లో ఆ వీడియోలు కూడా షేర్ చేశారు. కొందరు బస్తాలు.. బస్తాలు చేపలను తీసుకొని పోయారు. ఇప్పుడు ఏలూరులో ఇలా తీసుకున్నారు. కానీ అందులో ఉన్న వారి గురించి ఆలోచిస్తే బాగుండేది.