రోడ్డుపై లారీ బోల్తా: చేపల కోసం ఎగబడ్డ జనం, ఎక్కడ అంటే..?
కొందరు జనం మారడం లేదు. అవును పక్క వారు ఆపదలో ఉన్నా సరే పట్టించుకోవడం లేదు. తమకు ఫ్రీగా వస్తే చాలు అనుకుంటున్నారు. అవును ఏలూరులో ఇలాంటి ఘటన జరిగింది. చేపల లోడ్తో వెళ్తున్న లారీ జీలుగుమిల్లి మండలం దర్భగూడెంలో బోల్తా పడింది. లారీ కింద పడటంతో అందులో ఉన్న చేపలు రోడ్డు మీద పడ్డాయి. విషయం తెలిసిన స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు.
రమాదంలో ఎవరైనా చిక్కుకున్నారేమో అని కూడా పట్టించుకోలేదు. లారీ డ్రైవర్, క్లీనర్ బతికున్నారా లేదా అని చూడలేదు. వారి చూపంతా చేపల మీదే ఉంది. రోడ్డు మీద పడిన చేపల కోసం జనాలు ఎగబడ్డారు. చేపలను సంచుల్లో వేసుకోవడంలో బిజీ అయిపోయారు. దీంతో హవ్వా ఇదేం పని అని మిగతా వారు అనుకుంటున్నారు.

కర్ణాటక నుంచి వెస్ట్ బెంగాల్కు చేపల లోడ్తో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్, క్లీనర్కు గాయాలు కావడంతో పోలీసులు వారిని జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి తరలించారు. రోడ్డు మీద పడిన చేపలను సంచులు తెచ్చుకుని మరీ తీసుకుపోయారు. ఇలా చేపల కోసం ఎగబడటం ఆందోళనకు గురి చేస్తోంది. మనిషిలో మానవత్వం లేకుండా పోయింది.
ఇప్పుడే కాదు.. ఇదివరకు కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. అవును కొందరు జనం చేపలను ఎగబడి మరీ తీసుకున్నారు. అప్పట్లో ఆ వీడియోలు కూడా షేర్ చేశారు. కొందరు బస్తాలు.. బస్తాలు చేపలను తీసుకొని పోయారు. ఇప్పుడు ఏలూరులో ఇలా తీసుకున్నారు. కానీ అందులో ఉన్న వారి గురించి ఆలోచిస్తే బాగుండేది.
-
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు -
కుప్పకూలుతున్న బంగారం రేట్లు- ఈ వారంలో












Click it and Unblock the Notifications