Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సచివాలయ భవనాల కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్, అన్ని పిటిషన్లు కొట్టివేత, 80 శాతం కూల్చివేత..

తెలంగాణ సచివాలయం కూల్చివేతకు హైకోర్టు ఆమోదం తెలిపింది. సెక్రటేరియట్ కూల్చివేతకు సంబంధించి దాఖలైన పిటిషన్‌ అన్నింటినీ ధర్మాసనం కొట్టివేసింది. ఇఫ్పటికే 80 శాతం భవనాలను కూల్చివేయగా.. మిగతా 20 శాతం భవనాల కూల్చివేత ప్రక్రియకు అడ్డంకులు తొలగిపోయాయి. మరింత వేగంగా కూల్చివేత పనులు జరగనున్నాయి.

పీఎల్ విశ్వేశ్వర్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసానం శుక్రవారం కొట్టివేసింది. సచివాలయ భవనాల కూల్చివేతకు కేంద్ర అనుమతులు అవసరం లేదని.. కొత్తగా నిర్మించే భవనాలకు మాత్రమే అనుమతులు అవసరమని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ స్పష్టం చేశారు. నూతన నిర్మాణాలు చేపట్టే ముందు అన్ని అనుమతులు తీసుకుంటామని వెల్లడించారు. ల్యాండ్ ప్రిపరేషన్‌లోనే భవనాల కూల్చివేత వస్తుందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ఇరు వాదనలు విన్న హైకోర్టు.. కేంద్ర పర్యావరణ అనుమతి అవసరం లేదన్న సొలిసిటర్ జనరల్ వాదనను హైకోర్టు ఏకీభవించింది.

green signal for the demolition of the telangana secretariat..

మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని కూడా స్వాగతిస్తున్నట్లు పేర్కొంది. ప్రభుత్వం అన్ని అనుమతులు తీసుకున్నాకే కూల్చివేత పనులను చేపడుతుందని స్పష్టంచేసింది. భవనాల కూల్చివేతకు ప్రభుత్వానికి అన్ని అధికారులు ఉన్నాయని పిటిషన్ కొట్టివేసింది. అయితే కరోనా వైరస్ దృష్టిలో ఉంచుకుని కూల్చివేత పనులు చేపట్టాలని సూచించింది.

Recommended Video

    Engineering Colleges to Reopen In August in Telangana విద్యా శాఖపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు!!

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+