ka paul: దత్తత అంటే.. భూముల ఆక్రమణ, అమ్మడం, దోచుకోవడమే
మునుగోడు బై పోల్ రిజల్ట్ వచ్చింది. కానీ విమర్శలు మాత్రం తప్పడం లేదు. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్.. తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సారి మంత్రి కేటీఆర్ లక్ష్యంగా విమర్శలు చేశారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారని.. మద్యం ఎరులైపారిందని, డబ్బు విచ్చలవిడిగా పంచారని ఆరోపించారు.
మునుగోడు ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలు అక్రమాలకు పాల్పడ్డాయని కేఏ పాల్ ఆరోపించారు. ఓటర్లను ప్రలోభ పెట్టాయని అన్నారు. పోలింగ్ కోసం వీఎంలను కాకుండా బ్యాలెట్ పేపర్లను వినియోగించాల్సిందని తెలిపారు. అదే విషయాన్ని తాను చెప్పినా అధికారులు పట్టించుకోలేదని విమర్శించారు. అధికారులు అందరూ టీఆర్ఎస్ పార్టీ కోసం పని చేశారని విమర్శించారు.

మునుగోడును దత్తత తీసుకుంటానని మంత్రి కేటీఆర్ చెప్పారని కేఏ పాల్ తెలిపారు.దత్తత తీసుకోవడమంటే అక్కడున్న భూములను ఆక్రమించడం అని సంచలన ఆరోపణలు చేశారు. లేదంటే అమ్ముకోవడం, లక్షల కోట్లను దోచుకోవడం అన్నారు. మునుగోడు ఎన్నికను తక్షణమే రద్దు చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు.
బై పోల్లో కేఏ పాల్కు 805 ఓట్లు మాత్రమే వచ్చాయి. 13వ రౌండ్ లో అత్యధికంగా 86 ఓట్లను ఆయన సాధించారు. కానీ ఫస్ట్ ప్లేస్లో తాను నిలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రచారం కూడా జోరుగా చేశారు. ఇప్పుడు అధికార పార్టీపై విమర్శలు చేశారు. మంత్రి కేటీఆర్ మునుగోడును దత్తత తీసుకున్న తర్వాత.. ఆక్రమణలే ఉంటాయని పేర్కొన్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications