12 పుర్రెలు, ఎముకలు, ఆభరణాలు ప్రత్యక్షం.. కొండచరియ నుంచి రావడంతో..
మిజోరాం-త్రిపుర సరిహద్దులో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే శుక్రవారం ఉదయం కొండచరియలు విరిగిపడటంతో చోట ఎముకలు, ఆభరణాలు లభించాయి. దీంతో అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు. అక్కడ రహదారి నిర్మాణంలో ఉంది అని డిప్యూటీ కమిషనర్ డాక్టర్ లాల్రోజామా తెలిపారు.

ఉదయం కొండచరియ విరిగిపడిందని.. దాని తీసి వేసే సమయంలో అందులో 12 పుర్రెలు, ఎముకలు, చెవిపోగులు, స్మోకింగ్ పైప్, లభించాయి. అయితే ఇవీ మానవులేనని కచ్చితంగా చెప్పలేమని డీసీ తెలిపారు. దీనిపై శాస్త్రీయ పరిశీలన చేయాల్సి ఉందని చెప్పారు. వీటిని శనివారం ఫోరెన్సిక్ నిపుణులకు అప్పగిస్తామని.. వారు పరిశోధించి నిజ నిజాలు తెలియజేస్తారని తెలిపారు. తర్వాత ఘటనాస్థలానికి పోలీసులు కూడా వచ్చి పరిశీలించారు.
గతేడాది కూడా మట్టికుండలో అస్తిపంజర అవశేషాలు కనిపించాయి. కొన్నినెలల క్రితం త్రిపురలో గల జంపూయి కొండలలో, గతేడాది ఐజ్వాల్కు 20 కిలోమీటర్ల దూరంలో కూడా అలాంటి అవశేషాలు కనిపించాయని పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ సుజీత్ నయన్ తెలిపారు
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications