అనంతనాగ్లో ఎన్కౌంటర్: ఇద్దరు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో శనివాం ఉదయం భద్రతాసిబ్బంది, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.
కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..
అనంత్నాగ్లోని శిస్త్రాగమ్ గ్రామంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారని నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో శుక్రవారం రాత్రి నుంచి భద్రతాసిబ్బంది ఆ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ చేపట్టారు.

ఈ క్రమంలో శనివారం ఉదయం ఓ ఇంట్లో దాగి ఉన్న ముష్కరులు భద్రతాసిబ్బందిపైకి కాల్పులు జరిపారు. దీంతో సిబ్బంది ఎదురుకాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం ఎన్కౌంటర్ పూర్తయిందని.. ఘటనాస్థలం నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు అదికారులు తెలిపారు. హతమైన ముష్కరులను హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications