40 నుంచి 50 మిలియన్ల డోసుల వ్యాక్సిన్ నిల్వ: సీరం ఇనిస్టిట్యూట్
కరోనా వైరస్.. స్ట్రెయిన్ టెన్షన్తో టీకాల కోసం ఎదురుచూసే పరిస్థితి నెలకొంది. ఇందుకు సీరం ఇనిస్టిట్యూట్ తీపి కబురు అందించింది. ఆక్స్ ఫర్డ్ అస్ట్రాజెనెకాతో కలిసి సీరం ఇనిస్టిట్యూట్ కోవాక్సిన్ వ్యాక్సిన్ ప్రయోగ దశలో ఉంది. దీని ఎక్స్పర్ మెంట్ చివరి దశకు చేరిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ అత్యవసర ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చేందుకు సంసిద్దంగా ఉందని సమాచారం.
కిమ్ శర్మ అందాల ఆరబోత.. ముదురు వయసులో ఏ మాత్రం తగ్గని గ్లామర్
40-50 మిలియన్ల డోసులు సిద్దంగా ఉన్నాయని సీరం ఇనిస్టిట్యూట్ సీఈవో అదర్ పూనావాలా తెలిపారు. తమ కంపెనీ వ్యాక్సిన్ ఉత్పత్త కొనసాగుతుందని ఆయన వివరించారు. వచ్చే ఏడాది జూలై వరకు 300 మిలియన్ డోసుల వ్యాక్సిన్ సిద్దమవుతోందని చెప్పారు. తమ వ్యాక్సిన్ కొద్దీరోజుల్లోనే రెగ్యులేటరీ అనుమతి వస్తుందనే ధీమాతో ఉన్నారు. ఒకసారి పర్మిషన్ వస్తే.. క్రమంగా ఉత్పత్తి జరుగుతుందని చెప్పారు.

దేశంలో అత్యవసరంగా వ్యాక్సిన్ ఇవ్వడానికి తమకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి కోరారు. దీనికి సంబంధించి పర్మిషన్ ఇవ్వాలని విజ్ఞాపన కూడా అందజేశామని తెలిపారు. దీనిపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు కూడా సంతృప్తికరంగా ఉన్నాయని తెలుస్తోంది. ఆమోదం లభిస్తే.. వ్యాక్సిన్ల పంపిణీ ప్రక్రియ కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
కొత్త రకం స్ట్రెయిన్ టెన్షన్ నెలకొంది. బ్రిటన్ నుంచి వచ్చినవారి వల్ల ఆందోళన నెలకొంది. వారికి పరీక్షలు చేయగా నెగటివ్ వస్తుంది కానీ.. వారం లోపు మళ్లీ చేయాల్సి ఉంటుంది. అప్పటివరకు హోం క్వారంటైన్లో ఉంటే ఓకే.. వారు బయట తిరిగితే వైరస్ వ్యాపించే అవకాశం ఉంటుంది. కరోనా కన్నా ఇదీ 50 శాతం కన్నా ఎక్కువ విస్తరించే ఛాన్స్ ఉంది.












Click it and Unblock the Notifications