Ship hijack: 15 మంది భారతీయ సిబ్బంది ఉన్న షిప్ హైజాక్.. అప్రమత్తమైన నేవీ..
సోమాలియా తీరం సమీపంలో గురువారం సాయంత్రం 15 మంది భారతీయ సిబ్బందితో కూడిన కార్గో షిప్ 'MV లీలా నార్ఫోక్' హైజాక్ కావడంతో సముద్ర సంక్షోభం ఏర్పడింది. వెంటనే స్పందించిన భారత నావికాదళం సముద్ర గస్తీ విమానం, డిస్ట్రాయర్ INS చెన్నైని సముద్రంలోకి పంపినట్లు శుక్రవారం నేవీ అధికారులు తెలిపారు. గురువారం సాయంత్రం యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్ పోర్టల్ (UKMTO)కు షిప్ హైజాక్ అయినట్లు హెచ్చరిక అందింది.
సుమారు 5-6 మంది సాయుధ సిబ్బంది ఓడలోకి ఎక్కినట్లు సమాచారం. శుక్రవారం తెల్లవారుజామున ఇండియన్ నేవీ విమానం హైజాక్ అయిన ఓడను కనుగొంది. అందులో ఉన్న సిబ్బందితో కమ్యూనికేట్ అయి లింక్ ను ఏర్పచింది. దీంతో ఓడ కదలికలను నిశితంగా పరిశీలించవచ్చు. ఈ లింక్ ద్వారా విమానం తన నిఘాను కొనసాగిస్తుంది. సిబ్బంది తమ స్ట్రాంగ్ రూంలో ఉన్నారని, అక్కడి నుంచి నౌకను నడుపుతున్నామని నౌకాదళ ప్రతినిధి కమాండర్ మెహుల్ కర్నిక్ తెలిపారు.

ఈ ప్రాంతంలో పనిచేస్తున్న వివిధ ఏజెన్సీలు, బహుళజాతి దళాల (ఎంఎన్ఎఫ్లు) సమన్వయ ప్రయత్నాలతో పరిస్థితి నిరంతర నిఘాలో ఉందని నేవీ తెలిపింది. గురువారం కూడా ఎర్ర సముద్రంలోని అనేక వాణిజ్య నౌకలపై హౌతీ మిలిటెంట్లు దాడులను వేగవంతం చేయడంపై ప్రపంచవ్యాప్త ఆందోళనలు నెలకొన్నాయి. మధ్య, ఎర్ర సముద్రంలో జరుగుతున్న పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు భారత్ పేర్కొంది.
ఉత్తర, మధ్య అరేబియా సముద్రంలో నిఘా నిర్వహించడానికి, సముద్ర భద్రతా కార్యకలాపాలను చేపట్టడానికి తమ నౌకలు, విమానాలు "మిషన్ మోహరింపు"గా ఉన్నాయని భారత నావికాదళం తెలిపింది. "మేము నావిగేషన్ స్వేచ్ఛ, వాణిజ్య షిప్పింగ్ యొక్క స్వేచ్ఛా కదలికలకు చాలా ఎక్కువ ప్రాముఖ్యతనిస్తాము. ఇది అభివృద్ధి చెందుతున్న పరిస్థితి, మేము దాని అన్ని అంశాలను పరిశీలిస్తున్నాము" అని పేర్కొంది.












Click it and Unblock the Notifications