చిక్కుల్లో అద్వానీ!: బిగుస్తున్న బాబ్రీ ఉచ్చు.. మరిన్ని అభియోగాలు!?
అద్వానీతో పాటు బీజేపీ నేతలు మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి తదితరులపై కూడా మరిన్ని అభియోగాలు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
లక్నో: బాబ్రీ విధ్వంసం కేసు పునర్విచారణ నేపథ్యంలో బీజేపీ అగ్రనేత అద్వానీ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లే కనిపిస్తోంది. శుక్రవారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆయనపై మరిన్ని అభియోగాలు నమోదు చేసే అవకాశం ఉంది. అద్వానీతో పాటు బీజేపీ నేతలు మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి తదితరులపై కూడా మరిన్ని అభియోగాలు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
కాగా, బాబ్రీ కూల్చివేత అంశంలో అద్వానీ సహా పలువురు బీజేపీ అగ్ర నేతలపై ఉన్న కుట్ర కేసును 2011లో అలహాబాద్ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. అయితే సీబీఐ దీన్ని సుప్రీంలో సవాల్ చేయడంతో.. గత నెలలో సుప్రీం కోర్టు ఈ కేసును పునర్విచారణకు స్వీకరించింది.

కేసు విచారణను రెండేళ్లలో ముగించాలని సుప్రీం గత ఏప్రిల్ 19న సీబీఐ ప్రత్యేక న్యాయ స్థానానికి ఆదేశాలు జారీ చేసింది. ఆ సమయంలోనే మరో కీలక వ్యాఖ్య చేసింది. భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 120-బి ప్రకారం అద్వాణీ సహా తదితరులపై కొత్తగా అభియోగాలు మోపవచ్చునని తెలిపింది. ఇదిలా ఉంటే, ఇదే కేసులో ఆరో నిందితుడిగా ఉన్న శివసేన మాజీ ఎంపీ సతీశ్ ప్రధాన్ కు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications