బాబా రామ్ దేవ్ కు మరో షాక్
కోలకతా: ప్రముఖ యోగా గురు, పతంజలి వ్యవస్థాపకుడు రామ్ దేవ్ బాబాకు మరో షాక్ తగిలింది. ఆయుర్వేద సంస్థకు చెందిన వంట నూనె ప్రకటనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎఫ్ఎస్ఎస్ఎఐ మరో అడుగు ముందుకు వేసింది.
పతంజలికి షోకాజ్ నోటీసులు జారీ చెయ్యాలని కేంద్ర అనుమతుల సంస్థను కోరింది. వివరణ ఇవ్వాలని పతంజలికి ఎఫ్ఎస్ఎస్ఎఐ ఆదేశాలు జారీ చేసింది. పతంజలి ఉత్పత్తులను ప్రమోట్ చెయ్యడానికి ఉద్దేశించిన అవాస్తవాలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి.
ఇదే విషయం ఎడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇటీవల వ్యాఖ్యానించింది. కోల్డ్ ప్రాసెస్ట్ టెక్నాలజీ ద్వారా ఉత్పత్తి చేసే ఆవ నూనె రుచి బాగుండదని పతంజలి ఆయుర్వేద సంస్థ మీడియాలో ప్రచారం చేసింది.
వెంటనే ఈ ప్రచారాన్ని అడ్డుకోవాలని వంట నూనెల ఉత్పత్తిదారుల సంఘం (ఎస్ఈ) ఆహార భద్రతా, ప్రమాణాల భారతీయ సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఐ) ప్రకటనల ప్రమాణాల భారతీయ మండలి (ఎఎస్ సీ)కి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులు విచారించిన సంస్థ పతంజలికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.