అహ్మదాబాదు నుంచి బెంగళూరు వెళ్లే విమానంలో చెలరేగిన మంటలు
బెంగళూరు: ఈ మధ్యకాలంలో విమాన ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం పూణే రన్వేపై హఠాత్తుగా ఓ వాహనం రావడంతో పైలట్ విమానంను గాల్లోకి లేపడంతో విమానం కింది భాగం ధ్వంసమైంది. ఈ ఘటన మరువక ముందే గో ఎయిర్ విమానాయాన సంస్థకు చెందిన విమానంలో మంటలు చెలరేగాయి.అహ్మదాబాదు నుంచి బెంగళూరుకు ఈ విమానం వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది.
#GoAlert pic.twitter.com/TbJNocQ0rx
— GoAir (@goairlinesindia) February 18, 2020
అహ్మదాబాదు నుంచి బెంగళూరుకు వెళుతున్న జీ8 802 గోఎయిర్ విమానంలో హఠాత్తుగా మంటల చెలరేగాయి. అయితే వెంటనే మంటలు ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మంటలు చెలరేగగానే సిబ్బంది అలర్ట్ అయ్యారని వెంటనే మంటలను ఆర్పివేయడంతో విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు గోఎయిర్ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.

ఇక విమానంలోని ప్రయాణికులను కిందకు దింపి వారిని మరో విమానంలో తమ గమ్యస్థానాలకు చేర్చే ఏర్పాటు చేసినట్లు ప్రకటనలో వెల్లడించింది. మధ్యాహ్నం ఈ విమానం బయలుదేరి వెళుతుందని ప్రస్తుతం బెంగళూరు రన్వేను మూసివేయడంతో ఆలస్యం అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మధ్యలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాలు చేశామని ప్రకటనలో పేర్కొంది గోఎయిర్ సంస్థ.
#goalert pic.twitter.com/7p902z65Op
— GoAir (@goairlinesindia) February 18, 2020
Recommended Video

అహ్మదాబాదు నుంచి బెంగళూరుకు వెళ్లే గోఎయిర్ విమానం కుడి ఇంజిన్లో సాంకేతికలోపం తలెత్తింది. అయితే ఓ పక్షి ఢీకొనడంతోనే ఇది జరిగిందని గోఎయిర్ సంస్థ వెల్లడించింది. టేకాఫ్ తీసుకునే సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొంది. పక్షి ఢీ కొనగానే స్వల్పంగా మంటలు చెలరేగినట్లు సంస్థ తెలిపింది. అయితే ప్రయాణికులను ఎమర్జెన్సీ పద్ధతిలో కిందకు దించలేదని చెప్పిన గోఎయిర్ సంస్థ అంతా క్షేమంగా ఉన్నట్లు తెలిపింది. అంతేకాదు ప్రయాణికులు సిబ్బంది సురక్షితంగా ఉండటమే తమ ప్రాధాన్యమని ఎవరికైన ఇబ్బంది కలిగి ఉంటే క్షమించాల్సిందిగా గోఎయిర్ సంస్థ ప్రకటనలో తెలిపింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications