అహ్మదాబాదు నుంచి బెంగళూరు వెళ్లే విమానంలో చెలరేగిన మంటలు
బెంగళూరు: ఈ మధ్యకాలంలో విమాన ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం పూణే రన్వేపై హఠాత్తుగా ఓ వాహనం రావడంతో పైలట్ విమానంను గాల్లోకి లేపడంతో విమానం కింది భాగం ధ్వంసమైంది. ఈ ఘటన మరువక ముందే గో ఎయిర్ విమానాయాన సంస్థకు చెందిన విమానంలో మంటలు చెలరేగాయి.అహ్మదాబాదు నుంచి బెంగళూరుకు ఈ విమానం వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది.
#GoAlert pic.twitter.com/TbJNocQ0rx
— GoAir (@goairlinesindia) February 18, 2020
అహ్మదాబాదు నుంచి బెంగళూరుకు వెళుతున్న జీ8 802 గోఎయిర్ విమానంలో హఠాత్తుగా మంటల చెలరేగాయి. అయితే వెంటనే మంటలు ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మంటలు చెలరేగగానే సిబ్బంది అలర్ట్ అయ్యారని వెంటనే మంటలను ఆర్పివేయడంతో విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు గోఎయిర్ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.

ఇక విమానంలోని ప్రయాణికులను కిందకు దింపి వారిని మరో విమానంలో తమ గమ్యస్థానాలకు చేర్చే ఏర్పాటు చేసినట్లు ప్రకటనలో వెల్లడించింది. మధ్యాహ్నం ఈ విమానం బయలుదేరి వెళుతుందని ప్రస్తుతం బెంగళూరు రన్వేను మూసివేయడంతో ఆలస్యం అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మధ్యలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాలు చేశామని ప్రకటనలో పేర్కొంది గోఎయిర్ సంస్థ.
#goalert pic.twitter.com/7p902z65Op
— GoAir (@goairlinesindia) February 18, 2020
Recommended Video

అహ్మదాబాదు నుంచి బెంగళూరుకు వెళ్లే గోఎయిర్ విమానం కుడి ఇంజిన్లో సాంకేతికలోపం తలెత్తింది. అయితే ఓ పక్షి ఢీకొనడంతోనే ఇది జరిగిందని గోఎయిర్ సంస్థ వెల్లడించింది. టేకాఫ్ తీసుకునే సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొంది. పక్షి ఢీ కొనగానే స్వల్పంగా మంటలు చెలరేగినట్లు సంస్థ తెలిపింది. అయితే ప్రయాణికులను ఎమర్జెన్సీ పద్ధతిలో కిందకు దించలేదని చెప్పిన గోఎయిర్ సంస్థ అంతా క్షేమంగా ఉన్నట్లు తెలిపింది. అంతేకాదు ప్రయాణికులు సిబ్బంది సురక్షితంగా ఉండటమే తమ ప్రాధాన్యమని ఎవరికైన ఇబ్బంది కలిగి ఉంటే క్షమించాల్సిందిగా గోఎయిర్ సంస్థ ప్రకటనలో తెలిపింది.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications