హనీమూన్ మధ్యలో అలిగి వెళ్లిపోయాడు
న్యూఢిల్లీ/లక్నో: కొత్త దంపతులు హనీమూన్ యాత్రకు బయలుదేరి వెళ్లారు. తరువాత చిన్న విషయంలో గొడవపడి వరుడు మధ్యలోనే అలిగి వెళ్లిపోయిన విచిత్ర సంఘటన బీహార్ లోని పాట్నలో జరిగింది. విషయం తెలుసుకున్న వధువు కుటుంబ సభ్యులు విమానాశ్రయ అధికారుల మీద మండిపడుతున్నారు.
హనీమూన్ మధ్యలో వరుడు వెళ్లిపోవడంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఉత్తరప్రదేశ్ లోని లక్నోకు చెందిన యువతి, యువకుడికి వివాహం అయ్యింది. హానీమూన్ యాత్రలో భాగంగా ఇద్దరూ గోవాకు వెళ్లారు.
తరువాత వేరే ప్రాంతానికి బయులుదేరారు. ఇద్దరూ గురువారం ఇండిగో 6E 633 విమానంలో లక్నోకు బయలుదేరారు. ఆ సందర్బంలో ఇద్దరి మద్య చిన్న విషయంలో గొడవ జరిగింది. మాటామాట పెరగడంతో వరుడికి కోపం వచ్చింది. విమానం మార్గం మద్యలో పాట్నాలో అగింది.
విమానం నిలపడం ఆలస్యం వరుడు చిన్నగా విమానం దిగి అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయాడు. ప్రయాణికుడు గమ్యం చేరుకునే వరకు మధ్యలో దిగి వెళ్లడానికి విమానాశ్రయం అధికారులు అనుమతించరు. ఇప్పుడు వరుడు పారిపోవడంతో వధువు కుటుంబ సభ్యులు అధికారుల మీద మండిపడుతున్నారు.
ఈ విషయంపై ఇండిగో విమాన సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ విమానం గమ్యస్థానం చేరక ముందే ఇలా మధ్యలో దిగిపోయే ప్రయాణికులు చాల అరుదుగా ఉంటారని వ్యాఖ్యానించారు. అయితే వధూవరుల వివరాలు వెల్లడించడానికి విమానాశ్రయ అధికారులు నిరాకరించారు.