సిద్ధూకు ఎలాంటి షరతులు విధించలేదు: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి ఆమ్ ఆద్మీ పార్టీలో చేరేందుకు మాజీ క్రికెటర్, మాజీ ఎంపీ నవజ్యోత్ సింగ్ సిద్ధుకు ఎలాంటి ముందస్తు షరతులను తాము విధించలేదని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.
తన భార్యకు టిక్కెట్ ఇవ్వాలని కోరిన సిద్ధూకు ఏఏపీ నుంచి చుక్కెదురైందని, ఒక కుటుంబం నుంచి ఒకరికే టిక్కెట్ ఇస్తామని ఏఏపీ షరతులు విధించిందని వార్తలు వచ్చాయి. దీంతో సిద్ధూ ఏఏపీలో చేరే అంశంపై పునరాలోచనలో పడ్డారని పుకార్లు షికార్లు చేశాయి.

ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ శుక్రవారం ఉదయం ట్విట్టర్ ద్వారా స్పందించారు. సిద్ధూ చేరికపై పార్టీ అభిప్రాయం ఏమిటో తెలియజేయడం తన బాధ్యత అన్నారు. అందుకు కొంత సమయం పడుతుందన్నారు. అలాగే సిద్ధూ ఆలోచించుకునేందుకు కూడా కొంత సమయం అవసరమన్నారు.
More From
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications