Lecturer: ప్రభుత్వ ఉద్యోగం. రూమ్ లో లెక్సరర్ ముసుగులో ఆంటీ ఏం చేసిందంటే ?, రూ. 15 లక్షలు !
బెంగళూరు/ మంగళూరు: ప్రభుత్వ ఉద్యోగం సంపాధించి జీవితంలో సెటిల్ అయిపోవాలని ఎవరికైనా ఆశ ఉంటుంది. ప్రభుత్వ కాలేజ్ లో లెక్సరర్ ఉద్యోగం సంపాధించాలని ఓ యువకుడు చాలాకాలం నుంచి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే తాత్కాలిక లెక్సరర్ గా ఉద్యోగం చేస్తున్న ఆ యువకుడు ప్రభుత్వ ఉద్యోగం కోసం పోటీ పరీక్షలు రాస్తున్నాడు. కొన్ని సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న యువకుడితో తనకు ఎలాగైనా ప్రభుత్వ కాలేజ్ లో లెక్సరర్ గా ఉద్యోగం సంపాధించాలని కోరికగా ఉందని, అందుకు ఎంత డబ్బులు అయినా పర్వాలేదని, ఖర్చు పెట్టడానికి తాను సిద్దంగా ఉన్నానని చెప్పాడు. స్నేహితుడి కోరికను క్యాష్ చేసుకోవాలని అతని స్నేహితుడు స్కెచ్ వేశాడు. ఓ ఇంటికి ఆ యువకుడిని పిలిపించాడు. అంతే రూమ్ లో ఆ యువకుడిని కుర్చోబెట్టి ప్రభుత్వ ఉద్యోగం మాట్లాడటానికి ఇక్కడికి ఇద్దరు వస్తారని, నీ పని అయిపోతుందని చెప్పాడు. యువకుడు రూమ్ లో వేచి ఉన్న సమయంలో అందంగా, నాజుకుగా ఉన్న ఆంటీ ఎంట్రీ ఇచ్చింది. అంతే అక్కడ ఆంటీ ఆ యువకుడిని రాసలీలల్లో దింపి ఫోటోలు ,వీడియోలు తీశారు. రూ. 15 లక్షలు ఇవ్వకుంటే ఈ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని, నీకు ప్రభుత్వ ఉద్యోగం రాదని, నీ జీవితం ఇంతటితో ముగిసిపోతుందని లెక్సరర్ కావాలనుకుంటున్న యువకుడిని బ్లాక్ మెయిల్ చేశారు. యువకుడితో పాటు అతని తండ్రిని కూడా బ్లాక్ మెయిల్ చెయ్యడంతో అక్కడ కథ రసవత్తరంగా మారిపోయింది.

ప్రభుత్వం ఉద్యోగం కోసం ఆశపడిన యువకుడు
కర్ణాటకలోని కారవారలో రంజిత్ (పేరు మార్చడం జరిగింది) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ప్రభుత్వ కాలేజ్ లో లెక్సరర్ ఉద్యోగం సంపాధించాలని రంజిత్ చాలాకాలం నుంచి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే తాత్కాలిక లెక్సరర్ గా ఉద్యోగం చేస్తున్న రంజిత్ ప్రభుత్వ ఉద్యోగం సంపాధించాలనే ఆశతో పోటీ పరీక్షలు రాస్తున్నాడు.

ఐదు సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్
ఉత్తర కన్నడ జిల్లాలోని శిరిసిలోని ఉంచళ్లిలో రంజిత్ స్నేహితుడు అజిత్ శ్రీకాంత్ నాడిగ అలియాస్ అజిత్ (25) నివాసం ఉంటున్నాడు. రంజిత్, అజిత్ ఐదు సంవత్సరాల నుంచి మంచి స్నేహితులు. ఏవిషయాన్ని అయినా రంజిత్ అతని ఫ్రెండ్ అజిత్ తో షేర్ చేసుకుని అతని సూచనలు, సలహాలు తీసుకుంటున్నాడు.

ఎంత డబ్బు అయినా పర్వాలేదు.... నేను ఇస్తాను
ఐదు సంవత్సరాల నుంచి పరిచయం ఉన్న అజిత్ కు ఫోన్ చేసిన రంజిత్ తాను కాలేజ్ లెక్సరర్ గా ఉద్యోగం సంపాధించాలని కోరికగా ఉందని, తనకు ఎలాగైనా ప్రభుత్వ కాలేజ్ లో లెక్సరర్ గా ఉద్యోగం సంపాధించాలని ఆశగా ఉందని, అందుకు ఎంత డబ్బులు అయినా పర్వాలేదని, ఖర్చు పెట్టడానికి తాను సిద్దంగా ఉన్నానని చెప్పాడు.

మేడమ్ ఉన్నారు వచ్చేయ్
మాకు తెలిసిన కాలేజ్ లేడీ లెక్సరర్ ఉన్నారని, ఆమెతో మాట్లాడటానికి నువ్వు శివమొగ్గ రావాలని అజిత్ అతని ఫ్రెండ్ రంజిత్ కు చెప్పాడు. స్నేహితుడు రంజిత్ కోరికను క్యాష్ చేసుకోవాలని అతని స్నేహితుడు అజిత్ పక్కా స్కెచ్ వేశాడు. శివమొగ్గలోని ఓ ఇంటికి అజిత్ అతని స్నేహితుడు రంజిత్ ను జనవరి 17వ తేదీన పిలిపించాడు.

రూమ్ లోకి ఆంటీ ఎంట్రీ
రూమ్ లో రంజిత్ ను కుర్చోబెట్టిన అజిత్ ఇక్కడే నీకు ప్రభుత్వ ఉద్యోగం మాట్లాడటానికి ఇక్కడికి ఇద్దరు వస్తారని, నీ పని అయిపోతుందని చెప్పాడు. రంజిత్ రూమ్ లో వేచి ఉన్న సమయంలో అందంగా, నాజుకుగా ఉన్న శివమొగ్గకు చెందిన పద్మజా డిఎన్ (50) ఆంటీ రంజిత్ ఉన్న రూమ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

అబ్బాయితో రొమాన్స్ చేసిన ఆంటీ
కొంత సేపటికి గోలకేరిలో నివాసం ఉంటున్న ధనుష్ కుమార్ అలియాస్ దిలీప్ శెట్టి (25) అనే యువకుడు ఎంట్రీ ఇచ్చాడు. తరువాత దనుష్ బయటకు వెళ్లిపోయాడు. అంతే అక్కడ పద్మజా ఆంటీ ఆమె అందచందాలు ఆరబోసి రూమ్ లో ఒంటరిగా ఉన్న రంజిత్ ను రాసలీలల్లో దింపేసింది. కొంతసేపు రంజిత్ రూమ్ లో ఒంటరిగా ఉన్న పద్మజా ఆంటీతో ఏకాంతంగా గడిపాడని తెలిసింది.

జస్ట్ రూ. 15 లక్షలు డీల్
పద్మజా ఆంటీ రంజిత్ తో రాసలీలలు సాగించిన సమయంలో అతని స్నేహితుడు అజిత్, వాడి స్నేహితుడు దనుస్ ఫోటోలు ,వీడియోలు తీశారు. రూ. 15 లక్షలు ఇవ్వకుంటే ఈ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని, నీకు ప్రభుత్వ ఉద్యోగం రాదని, నీ జీవితం ఇంతటితో ముగిసిపోతుందని లెక్సరర్ కావాలనుకుంటున్న రంజిత్ ను పద్మజా ఆంటీ, అజిత్, దనుష్ బ్లాక్ మెయిల్ చేశారు.

తండ్రిని బ్లాక్ మెయిల్ చేసి చెక్ మీద సంతకం
రంజిత్ ను అదే రూమ్ లో కట్టేసిన అజిత్, దనుష్ జనవరి 18వ తేదీన అతని తండ్రి దగ్గరకు వెళ్లి ఆయనకు రంజిత్, పద్మజా ఆంటీల రాసలీలల ఫోటోలు, వీడియోలు చూపించి రూ. 15 లక్షలు ఇవ్వకుంటే ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని బ్లాక్ మెయిల్ చేశారు. తరువాత రంజిత్ తండ్రి దగ్గర ఆయన పేరుతో ఖాళీ చెక్ తీసుకున్న నిందితులు దానిని క్యాష్ చేసుకోవాలని అనేక ప్రయత్నాలు చేశారు.
Recommended Video

కిలాడీ ఆంటీ అండ్ కో అరెస్టు
అయితే రంజిత్ దగ్గర ఖాళీ బాండుపేపర్లు మీద సంతకాలు చేసుకుని అతన్ని వదిలేశారు. రంజిత్ ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో కిలాడీలు అజిత్, దనుష్ తో పాటు కిలాడీ లేడీ పద్మజా ఆంటీని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. కిలాడీ గ్యాంగ్ ఇంకా ఎంతమందిని ఇలా మోసం చేశారు అంటూ ఆరా తీస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications