వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాత్‌రూంలోకి కత్తి తీసుకెళ్లి, 'బిఏ పాస్' బాలీవుడ్ నటి శిఖా ఆత్మహత్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: బాలీవుడ్ నటి శిఖా జోషి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని వెర్సోవా ప్రాంతంలో మరో మహిళతో కలిసి ఆమె ఓ అపార్టుమెంటులో నివసిస్తున్నారు. శనివారం నాడు ఆమె స్నేహితురాలు స్నానపు గది తలుపులు వేసి ఉండటం గమనించింది.

తలుపులు తెరవాలని శిఖాజోషికి సూచించింది. రెండు నిమిషాల్లో తలుపు తీస్తానని చెప్పిన సదరు నటి ఎంతకూ తలుపు తీయలేదు. దీంతో అనుమానం వచ్చిన ఆమె పోలీసులకు తెలిపారు. లోపలకు వెళ్లి చూడగా ఆమె గొంతులోకి కత్తి దిగి, రక్తపు మడుగులో కనిపించింది.

ఆత్మహత్యగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 2012లో వచ్చిన బీఏ పాస్ సినిమాలో జోషి ఓ చిన్న పాత్ర పోషించారు.

 BA Pass actor Shikha Joshi commits suicide

శనివారం సాయంత్రం పోలీసులు మాట్లాడుతూ... శిఖా జోషి తనకు తాను బాత్ రూంలో లాక్ చేసుకుందని, ఆమె వద్ద అప్పుడు కత్తి ఉందని చెప్పారు. ఆ తర్వాత ఆమె రూమ్మేట్ బాత్ రూం గదిని తట్టారు. బయటకు రావాలని ఆమె సూచించింది.

కత్తి వెంట తీసుకు వెళ్లిన విషయం తెలిసి.. వెంట కత్తి ఎందుకు తీసుకు వెళ్లావని సదరు స్నేహితురాలు ప్రశ్నించింది. అయితే, ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చింది. బాత్ రూం గది తెరిచేసరికి రక్తపు మడుగులో పడి ఉంది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. శిఖా జోషి మెడ పైన మూడు గాయాలు ఉన్నట్లుగా గుర్తించారని తెలుస్తోంది.

English summary
A 40-year-old model-turned-actress committed suicide in her home in Andheri West on Saturday evening after slashing her neck open with a knife. The police said that a continued lack of employment led her to take her own life.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X