మైసూరు-చెన్నై మధ్యలో హైస్పీడ్ రైలు: వయా బెంగళూరు, రూ. లక్ష కోట్ల వ్యయం, జర్మనీ ప్రతిపాదన!
బెంగళూరు: మైసూరు- బెంగళూరు- చెన్నై మధ్యలో హైస్పీడ్ రైల్వే నెట్ వర్క్ ( అధిక వేగ రైల్వే వ్యవస్థ ) నిర్మించేందుకు జర్మనీ ప్రభుత్వం ఒక ప్రతిపాదనను రైల్వే బోర్డుకు సమర్పించింది. దీనికి ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తే 2030 నాటికి సాకారం కానుంది. రూ. లక్ష కోట్ల వ్యయంతో ఈ మార్గంలో హైస్పీడ్ రైల్వే నిర్మించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.
జర్మనీ రాయబారి మార్టీన్ నే సాధ్యాసాధ్య అధ్యయన నివేదికను రైల్వేబోర్డు ఛైర్మన్ అశ్వినీ లోహానికి సమర్పించారు. ఈ సందర్బంగా జర్మనీ రాయబారి మార్టీన్ నే మీడియాతో మాట్లాడుతూ మైసూరు-బెంగళూరు- చైన్నై మార్గంలో హైస్పీడ్ రైలులో ప్రయాణించాలంటే కేవలం 2 గంటల 25 నిమిషాల సమయం పడుతుందని అన్నారు.

హైస్పీడ్ రైల్వే నెట్ వర్క్ నివేదికను తయారు చెయ్యడానికి 18 నెలల సమయం పట్టిందని జర్మనీ రాయబారి మార్టీన్ నే అన్నారు. హైస్పీడ్ రైలు నిర్మాణ వ్యయం రూ. లక్ష కోట్లు ఉంటుందని మార్టీనే నే అన్నారు. హైస్పీడ్ రైలు ప్రణాళికకు మూడు సంవత్సరాలు, నిర్మాణానికి తొమ్మిది సంవత్సరాల సమయం పడుతోందని మార్టీన్ నే వివరించారు.
హైస్పీడ్ రైలు నిర్మాణం ప్రారంభం అయితే 2030 నాటికి పూర్తి అయ్యే అవకాశం ఉందని జర్మనీ రాయబారి మార్టీన్ నే వివరించారు. మైసూరు- బెంగళూరు- చెన్నై మార్గంలో 85 శాతం ఎత్తైన మార్గంలో 11 శాతం సొరంగ మార్గంలో హైస్పీడ్ రైలు సంచరిస్తుందని మార్టీన్ నే అన్నారు.
ప్రస్తుతం మైసూరు- బెంగళూరు- చెన్నై మార్గంలో రైలులో ప్రయాణించాలంటే దాదాపు 7 గంటల సమయం పడుతోంది. హైస్పీడ్ రైలు అందుబాటులోకి వస్తే దాదాపు 4.30 గంటల సమయం ఆదా అవుతందని అంచనా వేశారు. మైసూరు నుంచి బెంగళూరు మీదుగా చెన్నై వరకు 435 కిలోమీటర్ల దూరం ఉంది.
-
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!












Click it and Unblock the Notifications