యజమాని భార్యతో వివాహేతర సంబంధం: కళ్ళలో యాసిడ్ దాడి
పాట్నా: యజమాని భార్యతో వివాహేతర సంబంధాన్ని కలిగి ఉండడమే కాకుండా ఆమెతో కలిసి పారిపోయిన యువకుడిని పట్టుకొని కళ్ళలో యాసిడ్ పోశారు స్థానికులు. ఈ ఘటన బీహర్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.
పని ఇచ్చిన యజమాని భార్యతో ఓ యువకుడు వివాహేతర సంబంధం పెట్టుకొన్నాడు. భర్తను వదిలేసి ఆ యువకుడితో వివాహిత పారిపోయింది. నమ్మకంగా పనిచేస్తాడని యువకుడిని యజమాని నమ్మాడు.కానీ, ఆ నమ్మకాన్ని అతడు వమ్ము చేశాడు.
బీహర్ రాష్ట్రంలోని సమస్తిపూర్ జిల్లా బరౌనీ గ్రామానికి చెందిన ఓ రైతు దగ్గర ట్రాక్టర్ డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే యజమాని భార్యతో ఆ యువకుడు వివాహేతర సంబంధం పెట్టుకొన్నాడు.
వివాహేతర సంబంధంతో పారిపోయిన జంట
యజమాని భార్యతోనే వివాహేతర సంబంధం నడిపిన యువకుడు ఆమెతో కలిసి ఫిబ్రవరి 16వ, తేదిన పారిపోయాడు. ఇంట్లోని డబ్బులు, బంగారాన్ని తీసుకొని పారిపోయాడు. ఆ యువకుడి కోసం యజమాని కుటుంబ సభ్యులు వెతికారు. కానీ ఆచూకీ దొరకలేదు
యువకుడిపై యాసిడ్ దాడి
యజమాని భార్యతో పారిపోయిన యువకుడిని ఫిబ్రవరి 16వ, తేదిన అదే గ్రామానికి చెందిన కొందరు ఆచూకీని కనుగొన్నారు. పిప్రా చౌక్ వద్ద ఓ హోటల్ వీరిని పట్టుకున్న గ్రామస్థులు దాడికి తెగబడ్డారు.సిరంజీతో ఆ యువకుడి కళ్లలో యాసిడ్ కొట్టారు.
పోలీస్ స్టేషన్కు వచ్చిన వివాహిత
అయితే యువకుడిపై గ్రామస్థులు దాడి చేశారు. యాసిడ్ దాడి చేశారు. వివాహితను బెదిరించారు. అయితే వివాహిత నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్ళింది. తన భర్త వద్దకు వెళ్ళనున్నట్టు చెప్పింది. అయితే ఈ విషయమై పోలీసులు ఆరా తీస్తే యువకుడిపై దాడి జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిసింది.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు
కళ్ళలో యాసిడ్ దాడి జరిగి రోడ్డు పక్కన ఇబ్బందిపడుతున్న బాధితుడిని ఆ దారి వెంట వెళ్తున్న ఓ వ్యక్తి ఆసుపత్రిలో చేర్పించాడు. బాదితుడు చూపు కోల్పోయినట్టు వైద్యులు చెప్పారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరునిందితులను అరెస్ట్ చేసినట్టు పోలీసులు ప్రకటించారు.