కలహి నదిలో పడవ మునక: 25 మంది గల్లంతు
గౌహతి: అస్సాంలోని కామ్రూప్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. జిల్లాలో ఉన్న కలహి నదిలో ఓ పడవ మునిగిపోయింది. ఈ సంఘటనలో సుమారు 25 మంది గల్లంతయ్యారు. కాగా, కొందరు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు.
సమాచారం అందిన వెంటనే నేషనల్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. ప్రమాద సమయంలో పడవలో 200 మంది ఉన్నట్టు భావిస్తున్నారు. పడవలోని పలువురు ప్రయాణికులను రెస్క్యూ టీం కాపాడింది.

కాగా, 2012లో జరిగిన పడవ ప్రమాదంలో 40మందికి పైగా ప్రజలు మృత్యువాత పడ్డారు. వీరిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు.
ఛత్తీస్గఢ్లో 25 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 25 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. రాష్ట్రంలోని కొండగాం జిల్లాలో బస్తర్ ఐజీ ఎదుట ఇవాళ 25 మంది మావోయిస్టులు తాము లొంగిపోతున్నట్టు ప్రకటించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications