కలహి నదిలో పడవ మునక: 25 మంది గల్లంతు
గౌహతి: అస్సాంలోని కామ్రూప్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. జిల్లాలో ఉన్న కలహి నదిలో ఓ పడవ మునిగిపోయింది. ఈ సంఘటనలో సుమారు 25 మంది గల్లంతయ్యారు. కాగా, కొందరు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు.
సమాచారం అందిన వెంటనే నేషనల్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. ప్రమాద సమయంలో పడవలో 200 మంది ఉన్నట్టు భావిస్తున్నారు. పడవలోని పలువురు ప్రయాణికులను రెస్క్యూ టీం కాపాడింది.

కాగా, 2012లో జరిగిన పడవ ప్రమాదంలో 40మందికి పైగా ప్రజలు మృత్యువాత పడ్డారు. వీరిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు.
ఛత్తీస్గఢ్లో 25 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 25 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. రాష్ట్రంలోని కొండగాం జిల్లాలో బస్తర్ ఐజీ ఎదుట ఇవాళ 25 మంది మావోయిస్టులు తాము లొంగిపోతున్నట్టు ప్రకటించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications