UPSC: ఇద్దరు అభ్యర్థులు.. యూపీఎస్సీ ఫలితాల్లో ఒకే ర్యాంక్.. ఒకే రూల్ నంబర్..
యూపీఎస్సీ ఫలితాల్లో తప్పులు దొర్లాయి. మధ్యప్రదేశ్కు చెందిన ఇద్దరు యువతులకు ఒకే రూల్ నంబర్ తో పాటు ఒకే ర్యాంక్ వచ్చింది. దీంతో వీరి ఫలితాలపై ప్రతిష్టంభన నెలకొంది. దేవాస్ జిల్లాకు చెందిన అయాషా ఫాతిమా(23), అలీరాజ్పూర్ జిల్లాకు చెందిన అయాషా మక్రానీ(26) సివిల్స్ కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) నిర్వహించిన పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిద్దరికి ఒకే రూల్ నంబర్ వచ్చింది. తాజాగా ప్రకటించిన ఫలితాల్లో తమకు 184 ర్యాంక్ వచ్చిందని ఇద్దరు చెప్పుకుంటున్నారు.
దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్న ఇద్దరు యువతులు తమ వాదనలకు మద్దతుగా ఒకే రోల్ నంబర్తో ఉన్న అడ్మిట్ కార్డులను చూపిస్తున్నారు. దీనిపై వారు పోలీసులతో పాటు UPSCకి ఫిర్యాదు చేశారు. "నేను రెండు సంవత్సరాలు కష్టపడి చదివాను, నా మార్కులను మరెవర్ని తీసుకోనివ్వను" శ్రీమతి మక్రానీ చెప్పారు. యుపిఎస్సి, ప్రభుత్వం నుంచి తనకు న్యాయం జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తన రూల్ నంబర్ మరొకరికి ఉందని తెలుసుకుని తాను షాక్ అయ్యాయనని ఫాతిమా చెప్పారు.

"ఎదో తప్పు జరిగి ఉటుంది. మెమోరాండం ఇవ్వాలని ఆలోచిస్తున్నాను" అని అన్నారు. వారి అడ్మిట్ కార్డులను నిశితంగా పరిశీలిస్తే మరిన్ని వ్యత్యాసాలు కనిపిస్తాయి. మక్రానీ కార్డ్ పర్సనాలిటీ పరీక్ష తేదీ ఏప్రిల్ 25, 2023 గురువారం రోజు అని ఉంది. ఫాతిమా కార్డ్లో అదే రోజు మంగళవారంగా ఉంది. క్యాలెండర్ ప్రకారం, ఏప్రిల్ 25, 2023, మంగళవారంగా ఉంది. అంతేకాకుండా ఫాతిమా కార్డ్ QR కోడ్తో UPSC వాటర్మార్క్ను కలిగి ఉంది. అయితే మక్రానీ కార్డ్ ఎటువంటి QR కోడ్ లేకుండా సాదా కాగితంపై ప్రింట్అవుట్ లాగా ఉంది
అవసరమైన దిద్దుబాట్లు చేశామని ఫాతిమా సరైన అభ్యర్థి అని UPSC వర్గాలు తెలిపాయి. పొరపాటు ఎలా జరిగిందో విచారణ చేస్తామని కూడా పేర్కొన్నాయి. సివిల్ సర్వీస్ పరీక్ష భారతదేశంలో అత్యంత పోటీ, సవాలుతో కూడిన పరీక్షలలో ఒకటి ఉంది. ప్రతి సంవత్సరం సుమారు 800 ఖాళీల కోసం ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు పోటీ పడుతున్నారు. పరీక్ష మూడు దశల్లో నిర్వహిస్తారు. ప్రాథమిక పరీక్ష, ప్రధాన పరీక్ష, వ్యక్తిత్వ పరీక్ష. మొత్తం ప్రక్రియ పూర్తి కావడానికి ఒక సంవత్సరం కంటే ఎక్కువ సమయం పడుతుంది.












Click it and Unblock the Notifications