కాశ్మీర్లో విద్యార్థుల ముందే అసెంబ్లీలో కొట్టుకున్న ఎమ్మెల్యేలు
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో శుక్రవారం యుద్ద వాతావరణం కనిపించింది! ఎమ్మెల్యేలు ఒకరిని ఒకరు తోసుకోవడం, ఒకరి పైన మరొకరు చేయి చేసుకోవడం చేశారు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం జరిగింది. విద్యుత్ ప్రాజెక్టుల పైన చర్చ సందర్భంగా హింసాత్మక సంఘటన జరిగింది.
అధికార పీడీపీ, ప్రతిపక్ష నేషనల్ కాన్ఫరెన్స్ సభ్యులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. విపక్ష సభ్యులు సభాపతి పోడియం వైపు దూసుకెళ్లేందుకు యత్నించగా వారిని అడ్డుకునేందుకు అధికారపక్ష సభ్యులు ప్రయత్నించారు. విద్యుత్ ప్రాజక్టులను రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి తేవడంలో పీడీపీ, బీజేపీ సర్కారు విఫలమైందని నేషన్ కాన్ఫరెన్స్ ఆరోపించింది.

సభలోనే ధర్నాకు దిగింది. కాగా, దీనిని కొందరు విద్యార్థులు విజిటర్స్ గ్యాలరీ నుండి చూశారు. ఎమ్మెల్యేలు మార్షల్స్ను కూడా తోసేశారు. ఈ ఘటనలో ఓ భద్రతా సిబ్బంది అధికారికి గాయాలైనట్లుగా కూడా తెలుస్తోంది. అయినప్పటికీ పలువురు మార్షల్స్ ఎమ్మెల్యేలను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
అసెంబ్లీ సమావేశాలు చూసేందుకు వచ్చిన విద్యార్థులు సభలో ఇలాంటి సంఘటనలు చూడటం దురదృష్టకరమని, దురదడష్టవశాత్తూ వారు అసెంబ్లీ పైన నెగిటివ్ ఫీలింగ్తో వెళ్లవలసి వస్తోందని పీడీపీ నేత నయీమ్ అక్తర్ అన్నారు. విద్యార్థులు సదుద్దేశ్యంతో వెళ్తారని తాను మాత్రం భావించడం లేదన్నారు.
-
Amaravati: అమరావతిపై అసెంబ్లీ తీర్మానం-ఇవాళే కేంద్రానికి-చంద్రబాబు కామెంట్స్..! -
BJP అధికారంలోకి వస్తే 'చేపల' నిషేధం! దీదీకి స్ట్రాంగ్ కౌంటర్ -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications