బీజేపీ ఎంపీకి ఐసిస్ నుండి చంపేస్తామంటూ బెదిరింపు మెయిల్
ఢిల్లీ: భారతీయ జనతా పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు తరుణ్ విజయ్కు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు (ఐసిస్) నుండి బెదిరింపులు వచ్చాయి. దీంతో, ఆయన ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారు.
తనకు చంపేస్తామని బెదిరింపులు వచ్చాయని తరుణ్ విజయ్ చెప్పారు. కాశ్మీర్, జీహాదీ పైన తాను రాసిన వాటికి హెచ్చరికలు జారీ చేస్తూ ఈ బెదిరింపులు వచ్చాయని చెప్పారు. తనకు వచ్చిన బెదిరింపుల పైన అతను కేంద్ర హోంశాఖమంత్రికి, ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీకి ఫిర్యాదు చేశారు.

బీజేపీ ఎంపీకి వచ్చిన బెదిరింపుల పైన విచారణ చేయాలని బీఎస్ బస్సీ సైబర్ సెల్ విచారణ అధికారులను ఆదేశించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీ అడ్రస్ ద్వారా ఆ బెదిరింపు ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఎంపీ తరుణ్ విజయ్ తన ఫిర్యాదు లేఖలో.. పదిహేను రోజుల్లో తన ఈ మెయిల్ రెండుసార్లు హ్యాకింగ్కు గురయిందని చెప్పారు. తనకు ఇస్లామిక్ స్టేట్ నుండి బెదిరింపు వచ్చిందని, అయితే దానిని తాను పట్టించుకోలేదని, ఆ మెయిల్ తొలగించానని చెప్పారు. దీనిపై పోలీసులు విచారిస్తున్నారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications