Coronavirus: బెంగళూరు ప్రజలకు గుడ్ న్యూస్, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లకు గ్రీన్ సిగ్నల్, సీఎం!
బెంగళూరు/ న్యూఢిల్లీ: ఐటీ, బీటీ సంస్థల దేశ రాజధాని సిలికాన్ సిటీ బెంగళూరులో కరోనా వైరస్ కట్టడికి కర్ణాటక ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది. బెంగళూరు సిటీలో రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా వైరస్ కట్టడి కోసం ఆ వ్యాధి అనుమానిత లక్షణాలు ఉన్న ప్రజలకు బెంగళూరు సిటీతో పాటు పరిసర ప్రాంతాల్లోని మెడికల్ కాలేజ్ ఆసుపత్రుల్లో చికిత్స అందించడానికి కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప, ఆ రాష్ట్ర వైద్య, విద్యా శిక్షణా శాఖా మంత్రి డాక్టర్ సుధాకర్, అన్ని మెడికల్ కాలేజ్ ల యాజమాన్యం మంగళవారం జరిపిన చర్చలు ఫలించాయి. ప్రభుత్వం, మెడికల్ కాలేజ్ యాజమాన్యం జరిపిన చర్చలు ఫలించడంతో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప బెంగళూరు సిటీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు.

4, 500 బెడ్ లు రిజర్వ్
బెంగళూరు సిటీలో కరోనా లక్షణాలు ఉన్న అనుమానిత ప్రజలకు చికిత్స అందించడానికి మెడికల్ కాలేజ్ లు, వాటి అనుబంధ ఆసుపత్రుల్లో 4, 500 పడకలు (బెడ్ లు) కేటాయించడానికి మెడికల్ కాలేజ్ ల యాజమాన్యం అంగీకరించిందని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప మీడియాకు చెప్పారు. ఇక ముందు బెంగళూరు ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా మెడికల్ కాలేజ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందడానికి చక్కటి అవకాశం వచ్చిందని సీఎం బీఎస్. యడియూరప్ప అన్నారు.

మెడికల్ కాలేజ్ లు, విశ్వవిద్యాలయాలు
ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజ్ ల్లో మాత్రమే కరోనా వైరస్ వ్యాధి నయం చెయ్యడానికి అవకాశం ఉంది. అయితే ఇక ముందు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లు, విశ్వవిద్యాలయాల్లో కరోనా వైరస్ వ్యాధి అనుమానితులకు చికిత్స అందించడానికి అవకాశం ఇచ్చామని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప అన్నారు. బెంగళూరులోని 11 మెడికల్ కాలేజ్ ల్లో 2, 200 పడకలు కరోనా రోగులకు చికిత్స అందించడానికి అవకాశం ఉందని సీఎం బీఎస్. యడియూరప్ప అన్నారు.

ప్రైవేట్ ల్యాబ్ లకు ఓకే
కరోనా వైరస్ వ్యాధి అనుమానితుల సంఖ్య పెరిగితే ప్రభుత్వానికి 4, 500 పడకలు ఇవ్వడానికి మెడికల్ కాలేజ్ ల యాజమాన్యం అంగీకరించిందని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప అన్నారు. కరోనా లక్షణాలు ఉన్న ప్రజలకు వైద్య పరీక్షలు చెయ్యడానికి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ లు ల్యాబ్ లు ఏర్పాటు చేసుకోవడానికి తాము అనుమతి ఇచ్చామని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప అన్నారు.

అన్నింటికి ఓకే
ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో ప్రస్తుతం 2, 000 పడకలు ఉన్నాయి. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ల్లో 4, 500 పడకలు కరోనా వ్యాధి రోగులకు అందుబాటులోకి వచ్చాయని, ఇప్పుడు బెంగళూరులో అనుమానిత కరోనా వైరస్ రోగులకు చికిత్స అందించడానికి మొత్తం 6, 500 పడకలు సిద్దంగా ఉన్నాయని, అందుకు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ల యాజమాన్యం అంగీకరించిందని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప వివరించారు.
Recommended Video

ప్రైవేట్ సిబ్బందికి భీమా
కరోనా వైరస్ చికిత్స అందిస్తున్న ప్రైవేట్ కాలేజ్ సిబ్బంది, ఉద్యోగులకు ఆ వ్యాధి వలన ఏమైనా సమస్యలు ఎదురైతే వారికి ప్రభుత్వమే భీమా సదుపాయం కల్పిస్తుందని, వారు ఎలాంటి ఆందోళన చెందనవరసం లేదని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప వివరించారు. ఇప్పటికే అన్ని విషయాలపై బీబీఎంపీ అధికారులతో ప్రభుత్వం చర్చించిందని సీఎం బీఎస్. యడియూరప్ప వివరించారు. కర్ణాటక ప్రభుత్వం, ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యం కలిసి పని చెయ్యడానికి ప్రత్యేకంగా సమన్వయ సమితి కమిటీ ఏర్పాటు చేశామని సీఎం. బీఎస్. యడియూరప్ప వివరించారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications