COVID-19: 1,400 టన్నుల ఆక్సిజన్ ఇస్తారా ? లేదా ?, ప్రధానికి బీజేపీ సీఎం మనవి. లేదంటే !
చెన్నై: కరోనా వైరస్ మహమ్మారి దెబ్బతో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఇక్కడ మా పరిస్థితి మరీ దారుణంగా ఉందని, అత్యవసర వైద్యసేవలకు ఆక్సిజన్ చాలా అవసరం ఉందని, వెంటనే మాకు 1,471 టన్నుల ఆక్సిజన్ పంపించి ఆదుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి మనవి చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి మాకు ఆక్సిజన్ సరఫరా చెయ్యాలని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీని వేడుకోవడంతో దేశంలో ఆక్సిజన్ అవసరం ఎంత ఉందో ? అనే విషయం మనకు అర్థం అవుతోంది. సరైన సమయంలో ఆక్సిజన్ అందకపోవడంతో ఇప్పటికే పదుల సంఖ్యలో కరోనా రోగుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.

అలా అయితే మూసేయాలి అంతే ?
రాబోయే 10 రోజుల్లో కర్ణాటకలో ఆక్సిజన్ తో పాటు రెమిడిసివిర్ ఔషదాల కొరత తారాస్థాయికి చేరుకునే అవకాశం ఉందని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ప్రధాని నరేంద్ర మోదీ ముందు ఆవేదన వ్యక్తం చేశారని తెలిసింది., తమకు సరైన సమయంలో ఆక్సిజన్ రెమిడిసివిర్ టీకాలు, ఔషదాలు అందకపోతే అత్యవసర వైద్యసేవలు మూసివేసే పరిస్థితి ఎదురైయ్యిందని కర్ణాటక సీఎం బీఎస్. యడియూరప్ప విచారం వ్యక్తం చేశారని తెలిసింది.

1,471 టన్నుల ఆక్సిజన్ కావాలి
కర్ణాటకకు ప్రతిరోజు 1,471 టన్నుల ఆక్సిజన్ తో పాటు రెండు లక్షల రెమిడిసివిర్ డోసుల టీకాలు సరఫరా చెయ్యాలని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ప్రధాని నరేంద్ర మోదీకి మనవి చేశారు. దేశంలో కరోనా వైరస్ తాండవం చేస్తున్న 10 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ప్రధాని నరేంద్ర మోదీకి ఈ మనవి చేశారని తెలిసింది.

కేంద్రం ఇచ్చింది ఎంతంటే ?
గురువారం కర్ణాటక రాష్ట్రంలో 500 టన్ను ఆక్సిజన్ ఉపమోగించామని, కాని కేంద్ర ప్రభుత్వం కేవలం 300 టన్నుల ఆక్సిజన్ మాత్రమే సరఫరా చేసిందని సీఎం బీఎస్. యడియూరప్ప ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని ఎత్తి చూపించారని తెలిసింది. ఏప్రిల్ 25వ తేదీ పరిస్థితులను బట్టి కర్ణాటకకు 1,142 టన్నలు ఆక్సిజన్ అవసరం అవుతుందని, ఏప్రిల్ 30వ తేదీ నాటికి 1, 471 టన్నుల ఆక్సిజన్ అవసరం అవుతుందని సీఎం బీఎస్. యడియూరప్ప ప్రధాని నరేంద్ర మోదీ ముందు వివరించారని తెలిసింది

మీ చేతుల్లోనే ఉంది
కేంద్ర ప్రభుత్వం సరైన సమయంలో ఆక్సిజన్, రెమిడిసివిర్ టీకాలు సరఫరా చెయ్యకపోతే తాము కోవిడ్ 19 అత్యవసర వైద్య సేవలు తాత్కాలికంగా మూసివేయాల్సి వస్తుందని సీఎం యడియూరప్ప ప్రధాని నరేంద్ర మోదీకి చెప్పారని సమాచారం. మొత్తం మీద దేశంలో కరోనా తాండవం చేస్తున్న 10 ప్రధాన రాష్ట్రాల జాబితాలో కర్ణాటక కూడా ఉంది. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కరోనా కారణంగా ఎదుర్కొంటున్న ఆక్సిజన్ కొరత విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ ముందు ఆయన గోడు వినిపించడం హాట్ టాపిక్ అయ్యింది.
-
300 లోడింగ్.. చేసేది ఆ జట్లేః టీమిండియా లెజెండర్ -
SRH.. ఏదో తేడాగా ఉందేంటీ -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ












Click it and Unblock the Notifications