Biparjoy:అరేబియా సముద్రంలో పెను తుఫాన్- తీరం వైపు: భారీ వర్షాలు
పనాజి: అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. తీవ్ర రూపాన్ని దాల్చింది. మరి కొన్ని గంటల్లో వాయుగుండంగా మారుతుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. క్రమంగా పెను తుఫాన్గా మారడానికి అనుకూలమైన వాతావరణం నెలకొని ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో అరేబియా తీరం వెంబడి ఉన్న రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షలు పడుతున్నాయి. కేరళలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి.
అరేబియా సముద్రం ఆగ్నేయ ప్రాంతం గగనతలంపై 5.8 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడిన విషయం తెలిసిందే. వాతావరణం కేంద్రం అంచనాలకు అనుగుణంగా ఇది అల్పపీడనంగా మారింది. మరింత తీవ్ర రూపాన్ని దాల్చింది. ప్రస్తుతం అరేబియా సముద్రంలో ఉత్తరం వైపునకు తన దిశను మార్చుకుంది. ఈ మధ్యాహ్నానికి అరేబియా సముద్రం తూర్పు మధ్య భాగంలో వాయుగుండంగా మారుతుందని పేర్కొంది.

బుధవారం సాయంత్రం 5:30 గంటల సమయంలో గోవా తీరానికి పశ్చిమ- నైరుతి దశలో 860 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ముంబైకి నైరుతి దిశలో 970, గుజరాత్లోని పోర్బందర తీరానికి 1,050 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు అయిదు కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాన్ తీరం వైపు కదులుతోంది. గుజరాత్ వైపు కదులుతున్నట్లు నిర్ధారించారు.
మరో 24 గంటల వ్యవధిలో ఇది తుఫాన్గా ఆవిర్భవిస్తుందని, ఈ నెల 10వ తేదీ నాటికి తీరాని తాకొచ్చని అంచనా వేసింది. గుజరాత్ వద్ద తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నట్లు అభిప్రాయపడుతోంది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్న ప్రస్తుత దశలో తుఫాన్ ఏర్పడటం వల్ల అరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారిందని సూచించింది. అయిదు రోజుల పాటు మత్స్యకారులెవరూ సముద్రంలో వేటకు వెళ్లకూడదని విజ్ఞప్తి చేసింది.

రుతు పవనాల ఆగమన ప్రభావం అప్పుడే మొదలైంది కూడా. రాజధాని తిరువనంతపురం సహా పలు చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. సాయంత్రం 7 గంటల నుంచి ఏకధాటిగా తిరువనంతపురంలో వర్షం పడుతోంది. కన్నూర్ జిల్లాలోనూ భారీ వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జనజీవనం స్తంభించిపోయింది. వచ్చే 48 గంటల్లో వర్షాల తీవ్రత మరింత ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది.
-
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
పిడుగులు, భారీ వర్షాలు - ఏపీలో ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
బిల్ గేట్స్ వర్షాలను కంట్రోల్ చేస్తున్నారా? 'వార్' ఆన్ వెదర్! -
ఉరుములు, పిడుగులతో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ.. -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications